*ఊర పంది మాంసం ను, అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతున్న ముఠా అరెస్ట్* గోదావరిఖని : కొంత కాలంగా కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఊర పంది మాంసంను అడవిలో తిరిగే జింక, దుప్పి, అడవి పంది మాంసంగా నమ్మిస్తూ, జింక, దుప్పి, అడవి పంది లను వెటాడి చంపినట్లుగా ఫోటోలను వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ప్రజలను నమ్మించి, అదిక ధరలకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న వారిని గుర్తించి, వారిపైన నిఘా పెట్టి ఈరోజు శాంతినగర్, పెద్దపల్లి లో ఊర పంది మాంసంను అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతుండగా, *1) లోకిని అంజయ్య S/o ఎల్లయ్య, 37 సం, ఎరుకల r/o హన్మంతునిపేట్,* *2) రేవెల్లి సంపత్ S/o పీసరయ్య, 32 సం, ఎరుకల r/o వద్కాపూర్* అను ఇద్దరినిఅరెస్ట్ చేయడం జరిగినది. *ఇంకా వీరి ముఠా సభ్యులు అయిన* *1) లోకిని జంపయ్య r/o హన్మంతునిపేట్,* *2) లోకిని గణేష్ r/o హన్మంతునిపేట్,* *3) లోకిని అనిల్ r/o నిమ్మనపల్లి,* *4) రేవెల్లి శివాజీ r/o వడ్కపూర్,* *5) కుర్ర తిరుపతి r/o పెద్దకాల్వల* *6) కెదిరి తిరుపతి r/o పెద్దపల్లి* పరారిలో వున్నారు. వీరివద్దనుండి *1) 20 కిలోల ఊర పంది మాంసం* *2) 4 కత్తులు,* *3) మటన్ కొట్టె మొద్దుకర్ర* *4) తరాజు, బాట్లు* *5) AP-15-P-120 హీరో హోండా ప్యాషన్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకోనైనది.* ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన, ఏ.ప్రదీప్ కుమార్, సి ఐ. పెద్దపల్లి, కె.రాజేష్, ఎస్సై పెద్దపల్లి, కానిస్టేబుల్లు మాడిశెట్టి రమేష్, దుబాసి రమేష్ లను డి సి పి పెద్దపల్లి అభినందించారు.


Comments