శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):   శ్రీ పేర్ల దేవాంష్ కార్తికేయ తేజ గారి పేరు మీద అన్నదానం జరుపుటకు గాను ఖమ్మం కు చెందిన డా.పేర్ల హర్ష తేజ, డా.నవ్యశ్రీ లలిత గారు  శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ కార్యనిర్వనాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ గారు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.

Comments