శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): శ్రీ పేర్ల దేవాంష్ కార్తికేయ తేజ గారి పేరు మీద అన్నదానం జరుపుటకు గాను ఖమ్మం కు చెందిన డా.పేర్ల హర్ష తేజ, డా.నవ్యశ్రీ లలిత గారు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ కార్యనిర్వనాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ గారు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment