అమరావతి (ప్రజా అమరావతి);
రేపు (17.12.2021, శుక్రవారం) విశాఖపట్నంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన.
విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవం, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న సీఎం.
సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం.
5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్లో ఎన్ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్లను ప్రారంభించనున్న సీఎం.
6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్కు హాజరవనున్న ముఖ్యమంత్రి.
6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద ఉడా పార్క్తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్లను ప్రారంభించనున్న సీఎం.
సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న సీఎం.
అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం.