అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం*
*నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణం...వారి కాళ్ళ మీద వారిని నిలబెడుతూ...*
*పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ. 16.16 కోట్ల వడ్డీ రీఇంబర్స్మెంట్ కలిపి మొత్తం రూ. 526.62 కోట్లను నేడు (28.02.2022, సోమవారం) క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఇప్పటివరకు 14,16,091 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 1,416 కోట్లు...లబ్ధిదారుల తరపున బ్యాంకులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ. 32.51 కోట్లు*.
*చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం*
*లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి*.
*వీరందరికీ జగనన్న తోడు*
- గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు
- ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు
- చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు
- అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేదు. గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు.