అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన అంతర్జాతీయ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్) పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.
క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుధీర్ఘంగా చర్చ.
రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు – విజయవాడ మధ్య, విశాఖపట్నంలలో మూడు ప్రాంతాలలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, తిరుపతి ఆసుపత్రిలో చిన్నారులకు ప్రత్యేకంగా క్యాన్సర్ కేర్ సెంటర్.
సీఎం సూచనల మేరకు డాక్టర్ నోరి, అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్ కొండూరు తిరుపతిలో ఏర్పాటుచేయనున్న క్యాన్సర్ కేర్ సెంటర్పై తిరుపతిలో సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదించిన వైద్యులు.
క్యాన్సర్ చికిత్సతో పాటు స్క్రీనింగ్పై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం, క్యాన్సర్తో పాటు హెచ్పీవీ వ్యాక్సినేషన్పై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం, ప్రాధమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్న సీఎం.
ప్రతి పేదవాడికి కూడా క్యాన్సర్ చికిత్స అతి తక్కువ ధరలకే అందేందుకు అవసరమైన ప్రణాళిక సిద్దం చేయాలన్న సీఎం.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సకోసం కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు పెట్టాలని, అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటుచేయాలన్న సీఎం కోరిక మేరకు డీపీఆర్ సిద్దం చేసి ముఖ్యమంత్రితో చర్చించిన డాక్టర్ నోరి.
క్యాన్సర్ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆలోచనను అమలుచేసే ప్రణాళికలు సిద్దం చేసిన డాక్టర్ నోరి.
క్యాన్సర్చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా చర్చ.
చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా.. చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన.
ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్ అశోక్ కుమార్ కొండూరు, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.
addComments
Post a Comment