అమరావతి (ప్రజా అమరావతి);
*–కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం.*
*–క్యాంప్ కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.*
*–తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ.*
*అనంతరం వైద్య,ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష*
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... :*
కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి : సీఎం
.
అలాగే రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని సీఎం ఆదేశాలు.
ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్న సీఎం.
అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్ప్లే అయ్యేలా చూడాలన్న సీఎం.
108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్న సీఎం.
దీనివల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్న సీఎం.
ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది :
అలాంటి పరిస్థితి రాకూడదు:
ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలన్న సీఎం.
విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
పోలీసులు మరింత విజిలెంట్గా, అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారన్న సీఎం.
ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి.
దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి.
ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా వ్యవహరించాలి.
విద్య, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి.
ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే : అధికారులుకు సీఎం ఆదేశం.
కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కే ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు.