నెల్లూరు, (ప్రజా అమరావతి);
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద రూ 37 కోట్లను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా
నియోజకవర్గంలోని అర్హులందరికీ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ పరిధిలోని సోయందమ్మపురం, సీతారెడ్డితోటలు గ్రామాల్లో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్ను అందజేశారు. ఈ సంధర్బంగా సోయందమ్మపురం గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన త్రాగునీటి శుద్ది ప్లాంటును మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సంధర్బంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్నీ నియోజక వర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కోరిన విధంగా గ్రామాల్లో అబివృద్ది కార్యక్రమాలను చేపట్టుట జరుగుచున్నదన్నారు. సర్వేపల్లి నియోజక వర్గానికి సంబందించి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అంశం పెండింగ్లో వుందని, ఈ అంశంనకు సంబందించి 17 వేల మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని, వీరికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వీరిలో కొంతమందికి ఎన్నికల ముందు 14 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, వీరికి మిగిలిన 11 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్యాకేజీ కింద 37 కోట్ల రూపాయలను అర్హులందరికీ అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
మంత్రి వెంట ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, తహశీల్దార్ శ్రీ మనోహర్ బాబు, ఎంపిడిఓ శ్రీమతి ప్రత్యూష, సర్పంచి శ్రీమతి ఏందోటి రాజకుమారి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment