అమరావతి (ప్రజా అమరావతి);
*మూలపేట పోర్టు కు భూమి పూజ*
*ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్దికి బాటలు వేసే విధంగా సంతబోమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు నేడు (19.04.2023) భూమి పూజ చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*10 ఏళ్ళలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్ధితుల్లో, కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం*
*ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం, శరవేగంగా నిర్మాణం, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా సాగుతున్న పనులు, రేపటి నెలలోనే మచిలీపట్నం పోర్టుకు కూడా శంకుస్ధాపన*
*ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్కు, గొట్టా బ్యారేజ్ నుండి హిర మండలం రిజర్వాయర్కు రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా నేడు (19.04.2023) శంకుస్ధాపన*
*23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 4 బెర్తుల నిర్మాణం, జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగం. 30 నెలల్లో పూర్తికానున్న పోర్టు పనులు*.
*ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనున్న మూలపేట పోర్టు*
*సుమారు రూ. 16.000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు*
*విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి రూ. 109 కోట్లు కేటాయింపు, నౌపడలో 55 ఎకరాల్లో అధునాతన వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం*
*మూలపేట పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి*
*మూలపేట పోర్టు విశేషాలు*
పోర్టు సామర్ధ్యం 23.5 మిలియన్ టన్నులు, బెర్తుల సంఖ్య 4, ఎన్హెచ్ 16 ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి, నౌపడ జంక్షన్ నుండి పోర్టు వరకు 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం, గొట్టా బ్యారేజ్ నుంచి 50 కి.మీల పైప్ లైన్తో 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా, పోర్టుకు అనుబంధంగా 5000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు
*సిక్కోలు మత్స్యకారులకు బాసటగా*
2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీ జైలులో గడిపిన 20 మంది మత్స్యకారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, విదేశాంగ శాఖతో పలుసార్లు మంతనాలు జరిపి 6 జనవరి 2020న వారిని విడుదల చేయించడంలో సఫలీకృతమైన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
కరోనా లాక్డౌన్ సమయంలో గుజరాత్లో చిక్కుకున్న జిల్లాకు చెందిన 3,064 మంది మత్స్యకారులను రూ. 3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా స్వస్ధలాలకు చేర్చిన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం, ఇలాంటి పరిస్ధితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 పిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు త్వరలో ప్రారంభం, రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ పొడవునా ఒక పోర్టు లేక ఒక ఫిషింగ్ హార్బర్ దిశగా అడుగులు
ఇప్పటికే ఉన్న 6 పోర్టులు, రానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్
*మారనున్న ఉత్తరాంధ్ర ముఖ చిత్రం*
– శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరం, రేపటి నెలలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్ధాపన, భోగాపురం – విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి
– చురుగ్గా మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్ పనులు
– విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ఏర్పాటు, వచ్చే నెలలోనే
– పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజి, పాడేరులో వైయస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజి, అనకాపల్లి, విజయనగరం మెడికల్ కాలేజీల పనులు చురుగ్గా జరుగుతున్నాయి, పార్వతీపురం మెడికల్ కాలేజీ పనులు కూడా ప్రారంభం
– ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏకంగా రూ. 700 కోట్లతో వంశధార సర్ఫేస్ వాటర్తో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలలోని ఇళ్ళకు నీళ్ళందించే బృహత్తర కార్యక్రమంలో 95 శాతం పనులు పూర్తి, త్వరలో జాతికి అంకితం, పాతపట్నం నియోజకవర్గానికి కూడా దీనిని విస్తరిస్తూ మరో రూ. 265 కోట్ల పనులకు త్వరలో శంకుస్ధాపన
– సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి జూన్ నెలలో శంకుస్ధాపన
– శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలోని ప్రపంచ ఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్కు అంతర్జాతీయ స్ధాయిలో మార్కెట్ సదుపాయం
– కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కోకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి కేంద్రం కానున్న మూలపేట పోర్టు
– ఉక్కుతయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశం
– పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం, తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు
– రూ. 35 కోట్లతో పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ది
రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం.
addComments
Post a Comment