అప్పులతో రాష్ట్రం అతలాకుతలం.



అప్పులతో రాష్ట్రం అతలాకుతలం


ఏడాదిలో ఏకంగా రూ.1,37,576 కోట్ల అప్పు

అభివృద్ధి, సంక్షేమం రెండూ లేనే లేవు

ప్రభుత్వ ఆదాయం దారుణంగా పతనం

:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం




విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలోనూ అవినీతి

యాక్సిస్‌తో ఒప్పందంలో రూ.11 వేల కోట్ల స్కామ్‌

ఒక్కో యూనిట్‌ రూ.4.60తో కొనుగోలు ఒప్పందం

గతంలో ‘సెకీ’తో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ ఒప్పందం

యూనిట్‌ విద్యుత్‌ ధర కేవలం రూ.2.49 మాత్రమే

దాని వల్ల 25 ఏళ్లలో రూ.89,675 కోట్లు ఆదా

:శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి


రాజధాని నిర్మాణంలో అంతులేని అవినీతి

అంచనా వ్యయాలు దారుణంగా పెంపు

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అంటూ ప్రచారం

కానీ అప్పులతోనే పనులు. ఇప్పటికే వేల కోట్లు

మరో 50 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వ ప్రకటన

ఇప్పుడున్న భూమిలో నిర్మాణాలకు లక్ష కోట్లు వ్యయం

సేకరించే భూముల్లో నిర్మాణాలకు ఇంకా ఎంత వ్యయం?

మొత్తం నిర్మాణాలు పూర్తికి ఎన్ని లక్షల కోట్లు కావాలి?

:సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌


ఒకే దగ్గర అన్ని లక్షల కోట్లతో ఎందుకు నిర్మాణం?

విజయవాడ–గుంటూరు మధ్య 500 ఎకరాలు

అందులో పరిపాలనకు భవనాలు కడితే సరిపోతుంది

దీని వల్ల రెండు నగరాల్లో ఆస్తుల విలువ పెరుగుతుంది

ప్రజలపై భారం తగ్గుతుంది. స్కామ్‌లూ ఆగిపోతాయి

:ప్రభుత్వానికి శ్రీ వైయస్‌ జగన్‌ సూచన


అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం

సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు

ఏడాది గడిచినా, ఒక్క స్కీమ్‌ అమలు లేదు

అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు

ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం

దీంతో ప్రజల్లో ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత

వారి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌

:శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ


‘లిక్కర్‌ స్కామ్‌’ పేరుతో దారుణంగా వ్యవహారం

తప్పుడు సాక్ష్యాలు. తప్పుడు వాంగ్మూలాలు

అక్రమ కేసులు. అరెస్టులు. దుష్ప్రచారం

నిజానికి 2014–19 మధ్య లిక్కర్‌ స్కామ్‌

5 డిస్టిలరీల నుంచి 69 శాతం మద్యం సరఫరా

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం షాప్‌లు

అన్ని మద్యం షాపుల్లో అధికార పార్టీ వారికి ప్రమేయం

ప్రివిలేజ్‌ ఫీజు రద్దుతో దాదాపు రూ.5 వేల కోట్ల నష్టం

చంద్రబాబుపై సీఐడీ కేసు. ఆ కేసులో బెయిల్‌పై బాబు

2014–19 నాటి మద్యం విధానాలే ఇప్పుడు అమలు

నిజానికి చంద్రబాబునే ఇప్పుడు అరెస్టు చేయాలి

:తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌


రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

చట్టం, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు

అధికార దుర్వినియోగం. దర్యాప్తు సంస్థల ప్రభావితం

రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుతున్నారు

రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు

:గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌


ఏడాది పాలనలో ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో అరాచకాలు. దారుణాలు

అన్యాయమైన పాలనపై గళమెత్తుతూ ఆందోళన

ఆ ప్రక్రియలో వచ్చే నెల 4న ‘వెన్నుపోటు’ దినం

రాష్ట్రమంతా నిరసన కార్యక్రమం. కలెక్టర్లకు విజ్ఞప్తులు 

అన్ని వర్గాలను కలుపుకుని ఆ కార్యక్రమం చేస్తాం

:ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన


తాడేపల్లి (ప్రజా అమరావతి);:

ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం అమలు చేయకపోగా, ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు రూ.1.40 కోట్ల అప్పులు చేశారని, ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయమంతా.. చంద్రబాబు, ఆయన తోడు గజదొంగల జేబుల్లోకి వెళ్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:


నాణానికి రెండో వైపు:

రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై నాణ్యానికి రెండోవైపున ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన యుద్ధం కేవలం చంద్రబాబుగారితో మాత్రమే కాదు. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా యుధ్ధం చేస్తున్నాం.


బాగా తగ్గిన రాష్ట్ర సొంత ఆదాయం:

మా హయాంలో కోవిడ్‌ వంటి మహమ్మారిని రెండేళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అలా చేస్తూనే సంక్షేమం, అభివృద్ధి చూపాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. అదే చంద్రబాబుగారి ఏడాది పాలన చూస్తే, కాగ్‌ నివేదిక గమనిస్తే, ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. బాబుగారి పాలనంతా కూడా ఈ ఏడాది మోసాలతో సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొట్టారు.

రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌). పన్ను, పన్నేతర ఆదాయం రెండు గమనిస్తే, ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్‌రేట్‌ కనిపిస్తోంది. అందుకు కారణం ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయి. 

ఇదే సమయంలో దేశంలో దాన్ని చూస్తే, గ్రాస్‌ టాక్స్‌ రెవిన్యూస్, నాన్‌ టాక్స్‌ రెవిన్యూస్‌లో ఏకంగా 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.36,97,545 కోట్లు. అదే గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.32,50,181 కోట్లు. 

మన రాష్ట్ర ఆదాయంలో అంత తక్కువ పెరుగుదలకు కారణం, ఆ ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా, చంద్రబాబునాయుడు, ఆయన గజదొంగల ముఠా జేబులోకి వెళ్తోంది.


రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న చంద్రబాబు:

మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల కన్నా 30 శాతం ఎక్కువ.

ఇంకా మూల«ధన వ్యయం చూస్తే, మా హయాంలో చివరి ఏడాది ఆ మొత్తం రూ.23,330 కోట్లు కాగా, చంద్రబాబు 12 నెలల పాలనలో అది కేవలం రూ.19,177 కోట్లు. అంటే మైనస్‌ 17.80 శాతం అన్నమాట. ఈ గణాంకాలన్నీ చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి.


ఏడాదిలో కూటమి ప్రభుత్వం దారుణ అప్పు:

చంద్రబాబునాయుడు 2019లో దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ (పవర్‌ సెక్టార్‌ నాన్‌ గ్యారెంటీ అప్పులు సహా) అన్నీ కలిపి ఉన్న అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో రూ.3,32,671 కోట్ల అప్పులు చేసినట్లు కనిపిస్తుంది.

మా హయాంలో అప్పుల పెరుగుదల (కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌–సీఏజీఆర్‌) 13.57 శాతం. అదే అంతకు ముందు రాష్ట్రం విడిపోయి 2014లో చంద్రబాబునాయుడు చేతికి అధికారం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, 5 ఏళ్లలో ఆ మొత్తం ఏకంగా రూ. 3,90,247 కోట్లకు చేరింది.

అంటే చంద్రబాబు తన హయాంలో రూ.2,49,350 కోట్ల అప్పులు చేసి, ‘అప్పుల సామ్రాట్‌’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన హయాంలో సీఏజీఆర్‌ 22.63 శాతంగా నమోదైంది. 2019–24 మ«ధ్య 5 ఏళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మొత్తం రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబునాయుడు కేవలం ఈ 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశారు. అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఏకంగా 41 శాతం, చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశాడు. అదే ఒక ఆర్ధిక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఈ ప్రభుత్వం ఏకంగా రూ.81,597 కోట్ల అప్పు చేసింది.

ఆ అప్పులు వివరాలు ఇవీ..

ఎస్‌డీఎల్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌ ఏప్రిల్‌–2025: రూ.5750 కోట్లు

ఎస్‌డీఎల్‌ ఇన్సూరెన్సెస్‌ ఇన్‌ ఫస్ట్‌ వీక్‌ ఆఫ్‌ మే–2025: రూ7 వేల కోట్లు

ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ఏపీపీఎఫ్‌సీ: రూ.710 కోట్లు 

ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ మార్క్‌ఫెడ్‌: రూ.6 వేల కోట్లు

ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌: రూ.2 వేల కోట్లు 

ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ ఏపీఎండీసీ బాండ్స్‌: రూ.3,489 కోట్లు

బారోయింగ్స్‌ సెక్యూర్డ్‌ ఫర్‌ అమరావతి బై ఏపీ గవర్నమెంట్‌: రూ.31 వేల కోట్లు 

మొత్తంగా కలిపితే, మొత్తం అప్పు:  రూ.1,37,576 కోట్లు. ఇందులో ఒక్క అమరావతి నిర్మాణం కోసం చేసిన అప్పు రూ.31 వేల కోట్లు.


అప్పు కోసం రాజ్యాంగ ఉల్లంఘన:

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న 436 గనులపై ఉన్న హక్కులను ఏపీఎండీసీకి తీసుకొచ్చి, ఆ విలువను రూ.1.91 లక్షల కోట్లుగా వెల కట్టి, వాటిని తాకట్టు పెట్టి, బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా, రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్‌ వ్యక్తులకు హక్కులు కల్పించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు.. దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. 

ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ ఎక్స్‌క్లూజివ్‌ అథారిటీ ఉంటుంది. అలాంటిది ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ను ఏకంగా చంద్రబాబునాయుడు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అన్నింటికన్నా రాజ్యాంగ ఉల్లంఘన. 

ఆ విధంగా ఏపీఎండీసీ భవిష్యత్తును కూడా చంద్రబాబు అంధకారమయం చేస్తున్నాడు. ఏకంగా ఏపీఎండీసీని తాకట్టుపెట్టి అప్పులు తీసుకుని వచ్చి ఆ అప్పుల్ని డైవర్ట్‌ చేసుకుంటూ ఏపీఎండీసీని శాశ్వతంగా అప్పుల ఊబిలోకి నెట్టే కార్యక్రమం చంద్రబాబు దగ్గరుండి చేస్తున్నాడు. అలా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్‌ మీద ప్రైవేట్‌ వ్యక్తులకు అజమాయిషీ ఇస్తున్నాడు. ఇంకా ఏపీఎండీసీని ప్రైవేటుపరం చేసే పని చేస్తున్నారు. 


పీపీఏ. అవినీతి వ్యవహారం:

మరో అడుగు ముందుకేస్తే రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరింది. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా కంపెనీతో చంద్రబాబుగారు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇది ఏకంగా రూ.11 వేల కోట్ల స్కామ్‌.

యాక్సిస్‌ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్, వారి పీఎల్‌ఎఫ్‌ ప్రకారం ఏడాదికి 10 కోట్ల యూనిట్లు, యూనిట్‌ రూ.4.60 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా 210 కోట్ల యూనిట్లు కొంటున్నారు. ఒక్కో యూనిట్‌ ధర రూ.4.60. అదే మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49 మాత్రమే. అంటే ఒక్కో యూనిట్‌కు చంద్రబాబు ప్రభుత్వంలో అదనంగా రూ.2.11 చెల్లిస్తున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ 2.11 లెక్కిస్తే ఏటా రూ.440 కోట్ల చొప్పున 25 ఏళ్లకు పడే భారం రూ.11 వేల కోట్లు. 


బండ్లింగ్‌. బ్యాంకింగ్‌. బ్యాలెన్సింగ్‌:

ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబుగారు తెలివిగా బీబీబీ (బండ్లింగ్‌ బ్యాంకింగ్‌ బ్యాలెన్సింగ్‌) అన్న ప్రస్తావన తెచ్చారు. అంటే 4 గంటల పీక్‌ అవర్‌ అని చెప్పి, మొత్తం 24 గంటలకు యూనిట్‌ రూ.4.60కి కొంటూ, స్కామ్‌ చేస్తున్నారు. ఈ మధ్య సెకీ పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్‌ విద్యుత్‌ ధర కేవలం రూ.3.53 మాత్రమే. వాటిలో ఎన్టీపీసీ, రిలయెన్స్‌ సంస్థలు ఉన్నాయి. ఆ ధర లెక్క వేసుకున్నా, రూ.1.07 ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లే. ఆ విధంగా చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నారు. 

ఇక్కడ మరో విషయం చూస్తే, మనం చేసుకున్న ఒప్పందం ధర రూ.2.49 వల్ల జరిగిన మేలు చూస్తే.. రూ.2.11 వ్యత్యాసం వల్ల రూ.11 వేల కోట్ల భారం మోపితే, మా ప్రభుత్వం ఒప్పందం వల్ల, ప్రభుత్వానికి 7 వేల మెగావాట్లు, అంటే 17 మిలియన్‌ యూనిట్లు విలువ లెక్కిస్తే ఏటా రూ.3,587 కోట్లు. అలా 25 ఏళ్లలో రూ.89,675 కోట్లు ఆదా.


టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ. టిష్యూట పేపర్‌కు తక్కువ:

ఇంత చేసినా వక్రభాష్యాలు చూస్తే.. ఈనాడులో ఒక స్టోరీ. ‘సెకీ’ ఒప్పందానికి సన్మానం. సెకీ ఛైర్మన్‌ను తొలగించడానికి కారణం, జగన్‌ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం. దీన్ని చూస్తే ఈనాడు స్థాయి చూస్తే.. టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ. టిష్యూ పేపర్‌కు తక్కువ అనిపిస్తుంది.

ఏపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం డిసెంబర్‌ 1, 2021 కాగా, ఇప్పుడు తొలగించిన సెకీ సీఎండీ జూన్‌ 13, 2023లో నియమితులయ్యారు. రామేశ్వర్‌ప్రసాద గుప్తా అనే వ్యక్తి 2023లో సీఎండీగా వచ్చారు. అంతుకు రెండేళ్ల ముందు మా ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఆయన్ను తీసేస్తే, మా ప్రభుత్వంతో ఏం సంబంధం? 

ఇదెలా ఉందంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. అసలు వీరు మనుషులా? మాఫియా రాజ్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి. టీవీ5. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.


యథేచ్ఛగా భూముల కేటాయింపు:

రాష్ట్రంలో స్కామ్‌లు దారుణంగా జరుగుతున్నా, ఎల్లో మీడియాలో అస్సలు కనిపించవు. ఉర్సా కంపెనీ. ఊరూ పేరూ లేదు. అలాంటి సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారు. దాన్ని క్యాబినెట్‌లో క్లియర్‌ చేశారు. ఆ కంపెనీ యజమాని నారా లోకేష్‌కు స్నేహితుడు. ఇంకా లులూ సంస్థకు మాల్‌ కట్టడానికి రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారు. దాన్ని ఎల్లో మీడియా చూపదు. రాయదు.

ఈరోజు రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్‌›్జ ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి. ఇసుకను మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. మేము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోంది 80 లక్షల టన్నుల స్టాక్‌ ఇసుక పెడితే, రెండు నెలల్లో మొత్తం దోచేశారు.


స్కామ్‌లలో పరాకాష్ట. అమరావతి నిర్మాణం:

స్కామ్‌లలో పరాకాష్ట అమరావతి పనుల్లో అవినీతి వ్యవహారం. ఆ పనులకు సంబంధించి 2018లో టెండర్ల విలువ రూ.41,170.78 కోట్లు కాగా, అందులో అప్పుడు రూ.5,587.28 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.35,583 కోట్ల పనులు మిగిలాయి.

వాటిని రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి ఇప్పుడు దోపిడి చేస్తున్నారు. అందుకోసం గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన జ్యుడీషియల్‌ విధానాన్ని, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేశారు. ఈ స్కామ్‌లో తమ సదుపాయం కోసం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ విధానం తీసుకొచ్చారు. మా హయాంలో అది లేదు. కానీ, చంద్రబాబు దాన్ని తీసుకొచ్చి, టెండర్‌ ఇవ్వగానే 10 శాతం అడ్వాన్స్‌ ఇచ్చి, అందులో  ఇచ్చి, 8 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు.

5 ఐకానిక్‌ టవర్ల కోసం 2018లో టెండర్లు పిల్చినప్పుడు అప్పుడు వాటి విలువ రూ.2,271.14 కోట్లు కాగా, ఇప్పుడు మిగిలిపోయిన పనుల విలువను 105 శాతం పెంచి ఏకంగా రూ.4,668.82 కోట్లకు పెంచారు. ఒక్కో చదరపు అడుగు వ్యయం రూ.8,931. ఆ టవర్లు  దేనితో కడుతున్నారు. బంగారంతో కడుతున్నారా? వెండితో పూతలు వేస్తున్నారా?. ఇదే ప్రభుత్వం వేరే చోట్ల పనులకు ఇస్తున్న మొత్తం అన్ని పనులతో కలిపి చదరపు అడుగుకు రూ.2500 మాత్రమే.


సెక్రటేరియట్‌. అసెంబ్లీ. బాహుబలి నిర్మాణాలు:

ఇక సచివాలయం. అసెంబ్లీ నిర్మాణాలు. ఇప్పటికే అవి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాలు ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ కడతారట. హెచ్‌ఓడీ ఆఫీసులు కడతారట. 

వాటి కోసం 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణాలు చేస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌ఓడీలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉంటారు. వారు ఇప్పటికే 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో పని చేస్తున్నారు. మరి కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం ఎందుకు? అంటే, ఆ పనులు నిరంతరం జరగాలి. కమిషన్లు రావాలి.

హైదరాబాద్‌లో ఇటీవల కొత్త సచివాలయం 8.58 లక్షల చదరపు అడుగుల భవనం. రూ.600 కోట్లతో కట్టారు. దాంతో పాటు, హెచ్‌ఓడీ ఆఫీసులు కూడా తరలించారు. మరి ఇక్కడ 53.57 లక్షల చదరపు అడుగుల భవనాలు ఎందుకు?.

ఇప్పటికే కట్టిన అసెంబ్లీ వ్యయం రూ.180 కోట్లు. సచివాలయ వ్యయం రూ.300 కోట్లు. రెండూ గంగపాలు. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు. అలా మొత్తం రూ.600 కోట్లు. కొత్త భవనాలు కట్టాలనుకున్నప్పుడు, ఈ రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు?. ఈ నిర్ణయాలు సమంజసం అని ఎలా చెబుతారు? అప్పులు తెచ్చి భవనాలు కట్టి, ప్రజలపై భారం మోపడం ఎందుకు?. ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.8,900.

సాధారణంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.4500 పెడితే, ఫైవ్‌ స్టార్‌ వసతులతో అపార్ట్‌మెంట్‌ దొరుకుతుంది. హైదరాబాద్‌లో అయినా, బెంగళూరులో దొరుకుతాయి.

ఇంకా అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయం కూడా దారుణం. జాతీయ రహదారులు ఫోర్‌ లైన్ల నిర్మాణం కోసం కిలో మీటరు వ్యయం రూ.11.16 కోట్ల నుంచి రూ.14.42 కోట్లు. అదే అమరావతిలో కిలో మీటరు రోడ్డుకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్ల రూ.60 కోట్లు ఖర్చు.


నాడు అడ్డంగా దొరికిన చంద్రబాబు:

ఇదే చంద్రబాబునాయుడు గారు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి, లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉంది. అందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చింది.

పెండ్యాల శ్రీనివాసరావు చంద్రబాబుగారి పీఏ. కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఉంది. కేసు ఎదుర్కొంటున్నాడు. అయినా జంకు, బొంకు లేకుండా మళ్లీ యథేచ్ఛ దోపిడి చేస్తున్నాడు.


సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అంటూ.. అన్నీ అప్పులే!:

అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ అని అందరినీ మభ్య పెడుతూ, చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి.ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) బ్యాంక్‌ నుంచి రూ.5 వేల కోట్లు, సీఆర్‌డీఏ బాండ్ల  నుంచి రూ.21 వేల కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు.

మరి ఎక్కడ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌?. ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలకు సంబంధించే ఈ మధ్య ఫైనాన్స్‌ కమిషన్‌కు చంద్రబాబుగారు ప్రజెంటేషన్‌ ఇచ్చి, రూ.77 వేల కోట్లు కావాలని అడిగారు. అమరావతి కోసం చేస్తున్న, చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకే అర్థమవుతుంది.

ఇవి కాక మళ్లా 50 వేల ఎకరాలు సేకరించి అమరావతిని విస్తరిస్తారంట!. ఈ పెద్దమనిషి అమరావతి విస్తరణకు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. మరి పనులకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయే సరికి రూ.2, 3 లక్షల కోట్లు మొత్తం ఎన్ని లక్షల కోట్లు అవుతాయి?.


విజయవాడ–గుంటూరు మధ్య:

నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబుగారిని అడుగుతూ ఉన్నా. ఇంతింత అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి.. నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి.

కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య ఎన్‌హెచ్‌ దగ్గర్లో  నాగార్జునా యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడ –గుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్‌లు ఏవో కట్టు.  రీజనబుల్‌గా ఏదో సైజ్‌లో అయిపోతుంది. గుంటూరు–విజయవాడ ఎప్పుడైనా కలిసిపోతాయి. ఇప్పటికే నువ్వు చేసిన పనికి విజయవాడ, గుంటూరుల్లో రియల్‌ ఎస్టేట్‌ రేట్లు ఢమాలయ్యాయి.

ఇంతింత అప్పులు చేసి, ఇన్నిన్ని స్కామ్‌లు చేసే బదులు, నీ సొంత ఆస్తులు పెంచుకునే విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయండి చంద్రబాబు.

నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని బిల్డింగ్‌లు నిర్మించండి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. మచిలీపట్నంలో పోర్టు కట్టాం. మెడికల్‌ కాలేజీ నిర్మించాం. విజయవాడ– గుంటూరు మధ్య కడితే రేట్లు పెరుగుతాయి.


పాలనలో ప్రభుత్వ వైఫల్యం:

ఒక్క అవినీతి మాత్రమే కాదు.. పాలనలో కూడా ప్రభుత్వం వైఫల్యం. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌. ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు, ఆయన దొంగల ముఠా.. రకరకాల పనులు చేస్తున్నారు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. 

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది. ఒక్కటంటే ఒక్క పథకం అమలు లేదు. మా ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. మే నెల కూడా పూర్తి కావస్తోంది. ఇస్తానన్న రైతు భరోసా రూ.26 వేలు ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఎగనామం. ఆడబిడ్డ నిధి రూ.18 వేలు, నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36 వేలు, 50 ఏళ్లకే ప్రతి మహిళకు రూ.48 వేలు మోసం.

– ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఏడాది దాటింది. రూ.3600 కోట్లు. పేదలకు వైద్యం అందడం లేదు. 

ఇంకా మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల అమలు లేదు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్‌.


లిక్కర్‌ స్కామ్‌. ఫ్యాబ్రికేషన్‌:

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడుగారు తనకు తెలిసిన మాస్టర్‌ ఆర్ట్‌ను బయటకు తెచ్చారు. వ్యవస్థలు నాశనం చేయడంతో పాటు, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా లిక్కర్‌ స్కామ్‌ అంటూ రాజకీయ కక్షకు దిగారు. అసలు స్కామ్‌ ఎక్కడ జరిగింది? ప్రతి ఒక్కరూ ఆలోచించమని కోరుతున్నాను. మీ మనస్సాక్షిని అడగండి.

లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యం ఎక్కువ అమ్మి, అమ్మకాలు పెంచి, దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక అమ్కకాలు తగ్గి, పన్నులు పెంచితే డిస్టిలరీలు లంచాలు ఇస్తాయా?


రెండు ప్రభుత్వాలు. మద్యం విక్రయాలు:

ఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారవ చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్‌ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్‌ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.


అసలు లంచాలు ఎప్పుడిస్తారు?:

మద్యం ్రçపభుత్వమే స్వయంగా అమ్మితే లంచాలు ఇస్తారా? షాపులు తగ్గించి, పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్‌ వ్యాపారం అప్పజెప్పి, అడ్డగోలుగా రోజంతా అమ్మి, లాభాలు గడిస్తే, డిస్టిలరీలకు ఎక్కువ ఆదాయం వస్తే లంచాలు ఇస్తారా?. ఆలోచించండి.

పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించినా, తమకు కావాల్సిన వారికే షాపులు వచ్చేలా చేశారు. వేరే ఎవరు షాప్‌ దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. రోజంతా అమ్ముతున్నారు. చివరకు డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. చివరకు బెల్టుషాప్‌ల నిర్వహణకు వేలంపాట పాడుతున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. అలా వస్తున్న ఆదాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కాకుండా ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే, ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్‌ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు.

ఇది మా హయాంలో జరిగిందా? ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మారా? మరి లంచాలు ఎవరికి ఇస్తారు?

ప్రైవేటు షాపుల చేత, వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీకి ఎక్కువ ఆర్డర్‌ ఇస్తే, లంచాలు ఇస్తారా? లేక మా హయాంలో మాదిరిగా ప్రతి బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టి, దాన్ని అమ్మేటప్పుడు దాన్ని స్కాన్‌ చేసి, అది ఆటోమేటిక్‌గా అప్‌లోడ్‌ చేసే విధానం అమలు చేశాం. ఆ మేరకు ఆ డిమాండ్‌ మేరకు ఆయా డిస్టిలరీల నుంచి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అలా చేస్తే లంచాలు ఇస్తారా?.


2014–19 మధ్య మద్యంలో అవినీతి:

చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్లు, కొన్ని డిస్టిలరీలకు మాత్రమే మేలు చేసేలా ప్రైవేటు లిక్కర్‌ షాప్‌ల నుంచి ఇండెంట్‌ పెట్టించడం ద్వారా 2014–19 మధ్య కేవలం 5 డిస్టిలరీలు రాష్ట్రంలో 69 శాతం మద్యం సరఫరా చేశాయి. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు ఉంటే, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు. మిగిలిన ఆరు వేర్వేరు ప్రభుత్వాల్లో అనుమతి పొందాయి. ఇంకా మద్యం సేకరణకు ఆ 20 డిస్టిలరీలను లిస్ట్‌ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. మేము కొత్తగా ఏ డిస్టిలరీ కూడా చేర్చలేదు. కొత్త డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు.


సీసీఐలో కేసు. దర్యాప్తు. తీర్పు:

చివరకు చంద్రబాబు అండ్‌ కో కంపెనీలు మా ప్రభుత్వంలో 2022లో కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)లో కేసు వేశాయి. ఈ ఆర్డర్‌ జాగ్రత్తగా పరిశీలించాలని అందరినీ కోరుతున్నా. ఈ పిటిషన్‌లో వేసిన అంశాలన్నీ టీడీపీ వాళ్లు అప్పుడూ, ఇప్పుడూ చేస్తున్న అభియోగాలే. అందుకే అందరూ జాగ్రత్తగా చూడాలని కోరుతున్నా.

అభియోగాలు ఏంటంటే.. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టేశారని, సప్లయ్‌ ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లలో ఆరోపించారు. కానీ, సీసీఐ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి, సంబంధించిన అన్ని రికార్డులను చూసి, సప్లయ్‌ ఆర్డర్లన్నింటినీ పరిశీలించి 2022 సెప్టెంబర్‌ 19న చారిత్రాత్మకమైన జడ్జిమెంట్‌ కూడా ఇచ్చారు. 

‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పు ఇచ్చింది. సీసీఐ ఇచ్చిన తీర్పులో పారాగ్రాఫ్‌ 85, 90, 95, 96, 97, 98, 101లో మొత్తం వివరాలు ఉన్నాయి. సీసీఐ జడ్జిమెంట్‌ కాపీలు పబ్లిక్‌ డొమైన్లో ఉంచుతాం. 


మళ్లీ అవే ఆరోపణలు:

వాస్తవాలు ఇలా ఉంటే.. తప్పు చంద్రబాబు చేసి.. ప్రైవేట్‌ షాపుల కార్టల్‌తో తనకు కావాల్సిన డిస్టలరీలకు మేలు జరిగే విధంగా ప్రైవేట్‌ షాపుల చేత తాను ఇండెంట్‌ ప్లేస్‌ చేసి, తాను ఈ రకమైన ఐదు డిస్టలరీలకు 69 శాతం ఆర్డర్లు ప్లేస్‌ చేసి.. ఆయన స్కామ్‌ చేస్తే.. ఎదురు ఆరోపణ మళ్లీ ఆయనే చేస్తున్నాడు. 

ప్రతీ బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టి, అమ్మేటప్పుడు కోడ్‌ స్కాన్‌ చేసి,  డైనమిక్‌గా రియల్‌ టైమ్‌ బేసిస్‌లో ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అయ్యే విధంగా చేశాం. దాని ఆధారంగా పారదర్శకంగా మేము చేస్తే చంద్రబాబు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నాడనేదానికి తాజా ఘటనలు నిదర్శనం. 


తప్పుడు సాక్ష్యాలు. వాంగ్మూలాలు. కేసులు:

వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబునాయుడు ఇప్పుడు బయటపెట్టి, బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి, అరాచకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

సత్యప్రసాద్‌. అనూష:

బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సత్యప్రసాద్‌ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి. సూపరింటెండెంట్‌ స్థాయి. ఎంత మంది ఉంటారో తెలుసా సూపరింటెండెంట్‌ లు? పదుల సంఖ్యలో ఉంటారు. అనూష అనే ఇంకో అమ్మాయి. చిన్న క్లరికల్‌ ఉద్యోగి. అది కూడా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. వాళ్లను బెదిరించి తీసుకోవడం ఏందండీ ఇది? 

వాసుదేవరెడ్డి:

ఇక బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు. అలాంటి వ్యక్తిని బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని, స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత, ఆనన మళ్లీ సెంట్రల్‌ సర్వీస్‌కు వెళ్లిపోవడానికి ఎన్‌ఓసీ ఇచ్చారు. అంత వరకు బ్లాక్‌ చేశారు. 

ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఎన్‌ఓసీలు ఆపుతున్నారు. మూడుసార్లు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేసుకున్నా దిక్కూ దివాణం లేదు. 

వి.విజయసాయిరెడ్డి:

ఇంకొకాయన విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరాలు టర్మ్‌ ఉండగా, చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. వైయస్సార్‌ సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్లీ రాజ్యసభకు వైయస్సార్‌ సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్మ్‌ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది?. అటువైపు నుంచి మనం కూడా ఎవర్ని అయినా తీసుకుని ఇదే మాదిరిగా చెప్పిస్తే వ్యాల్యూ ఉంటుందా? 

రాజ్‌ కేసీరెడ్డి:

మరో నిందితుడిగా చెబుతున్న రాజ్‌ కేసిరెడ్డి.. అసలు ఈయనకు, బేవరేజెస్‌ కార్యకలాపాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అదీ 2 సంవత్సరాలు మాత్రమే. అది కూడా కోవిడ్‌ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు. 

ఆయన ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు, సులభంగా ప్రలోభపెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి, ప్రలోభాలు పెట్టి అప్రూవర్‌ గా నిన్ను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పమంటే.. ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల అక్యూజ్డ్‌ గా చేర్చారు. అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. 

ఒక వేళ ఈయన కూడా వీళ్లకు కావాల్సిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్‌ ఇచ్చి ఉంటే ఈయన్ను కూడా వాసుదేవరెడ్డిని వదిలేసినట్లు వదిలేసే వారు. అంతే కదా?. 

ఇలా చేయదల్చుకుంటే ఎవరి మీదనైనా ఎవరైనా భేతాళ విక్రమార్క కథలు అల్లేసి ఏమైనా చెప్పించవచ్చు. వీళ్ల కథలు ఉంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ ఎక్కడో కలిశారు అంటారు. కలిస్తే గూగుల్‌ టేక్‌ అవుట్స్‌ లో కనిపించవా? చూపించలేరా? 

అసలు ఇలాంటి వారు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక భేతాళ కథ అల్లి.. సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్‌ రైట్‌ సెంటర్‌ అరెస్టు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. 

పీవీ మిధున్‌రెడ్డి:

రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్‌ కార్పొరేషన్, లిక్కర్‌ తో మిథున్‌ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్‌ సభ ఎంపీ, లోక్‌ సభలో ఫ్లోర్‌ లీడర్‌. వాళ్ల నాన్న కూడా కనీసం ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్‌రెడ్డికి? 

ధనుంజయరెడ్డి. కృష్ణమోహన్‌రెడ్డి:

ఇప్పుడు అరెస్టు చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి. అసలు వీళ్లిద్దరికీ కేసుతో ఏం సంబంధం? ధనుంజయ్‌ అన్నకు కానీ, కృష్ణమోహన్‌ అన్నకు కానీ ఏం సంబంధం? మద్యంకు సంబంధించి ఒక్క  ఫైలు అయినా సీఎంఓకు వచ్చినట్లు ఒక్క సంతకం అయినా చూపించగలరా? సవాల్‌ విసురుతున్నా చంద్రబాబుకు నేను. అసలు ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్‌ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం?.

బాలాజీ గోవిందప్ప:

ఇంకొకాయన బాలాజీ గోవిందప్ప. ఆయన మల్టీ నేషనల్‌ కంపెనీ వికాట్‌ కంపెనీలో వారి గ్రూప్‌ కంపెనీల్లో హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌. ఆయన ఏపీలోనే ఉండరు. వికాట్‌ అనేది యూరప్‌ లోనే టాప్‌ 5 సిమెంట్‌ కంపెనీల్లో ఒకటి. వీళ్లకు టైమ్‌ ఉండదు చంద్రబాబు, ఈనాడు రాతలు, వీళ్ల ప్రకారం మాటలు చూస్తే ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవాడు అని ఏదో రాసుకొచ్చారు. 

అసలు నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చానా మంది నాకున్నారు. నా కంపెనీలో పని చేస్తున్న ఎంప్లాయీస్‌ నాకు కూడా ఉన్నారు. అసలు వీకా అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్‌ లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్‌ నాది అయిపోదు. నాకు ఓనర్‌షిప్‌ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి. దాంట్లో ఎంప్లాయీస్‌ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్‌ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నా కంపెనీ కాని కంపెనీలో డైరెక్టర్లను, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? కేవలం భారతి సిమెంట్స్, జగన్‌ మోహన్‌ రెడ్డికి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీని అప్రతిష్టపాలు చేయాలి. చేసేది ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మల్టీ నేషనల్‌ కంపెనీకి రాంగ్‌ వైబ్‌ పంపుతున్నారు. 12 దేశాల్లో వాళ్లకు ఆపరేషన్స్‌ ఉన్నాయి. 


పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నారు:

ఇప్పటికే సజ్జన్‌ జిందాల్‌ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేసి ఆ మనిషి ఇక్కడ వ్యాపారం చేయకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్‌ నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్‌ జిందాల్‌ చెబుతున్నాడు.

అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడికి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్‌ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వాళ్ల మీద ఆరోపణలు చేసి, లాస్ట్‌ కి షిప్‌ పోయింది, సీజ్‌ పోయింది. బియ్యం పోయాయి. వాళ్లేమో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం సామీ వ్యాపారం చేయలేం అంటున్నారు. 

ఇప్పుడు వీళ్లు. ఈ మల్టీ నేషనల్‌ కంపెనీ. ఫ్రాన్స్‌లో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ కంపెనీ. యూరప్‌ లో టాప్‌ 5 సిమెంట్‌ కంపెనీల్లో ఒకటి. వీళ్లు ప్రపంచానికి చెబుతారు. ఆంధ్ర రాష్ట్రం నమస్కారం సామీ ఈడ వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌.. ఆయన నమస్కారం పెడుతున్నాడు. 

ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలి. వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎలా వాళ్లందరినీ ఇబ్బందులు పెట్టాలి, ఎలా వాళ్ల పరువును తీయాలి? ఎలా వాళ్లను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలని చూస్తే ఆంధ్రప్రదేశ్‌ కు ఎవరూ రారు. 


వాళ్లు ఎలాంటి మచ్చలేని వారు:

ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్‌. రిటైర్డ్‌ ఐఏఎస్‌. పాపం ఆయన కొడుక్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తీసుకొచ్చి ఆయన్ను జైల్లో పెట్టారు. కృష్ణమోహన్‌ అన్న ఒక రిటైర్డ్‌ ఆర్డీఓ. మచ్చలేని ఆఫీసర్‌ ఆయన. ఆయన కూతురుకు ఈ మధ్య కాలంలోనే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప.. పాపం ఆయన కూతురుకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 

ఎక్కడికి పోతున్నాం మనం. ఇంకో ఆఫీసర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు. డీజీ స్థాయి ఐపీఎస్‌. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌ లను జైల్లో పెట్టడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే లేదు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండో కొడుక్కు పెళ్లి ఖాయమైంది. వాళ్లు ఏమనుకుంటారో అని, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు భార్య పోయి వాళ్లతో మాట్లాడుకోవాల్సి వచ్చింది. 

సునీల్‌ కుమార్‌ డీజీ స్థాయి అధికారి. ఐపీఎస్‌. దళిత ఆఫీసర్‌. సస్పెండ్‌ చేసి హరాస్‌ చేస్తున్నారు. సంజయ్‌ అడిషనల్‌ డీజీ. దళిత ఆఫీసర్, సస్పెండెడ్, హరాస్డ్‌. కేసులుపెట్టారు. విజయ్‌ పాల్‌ ఏఎస్పీ. తప్పుడు కేసులతో అరెస్టు, హరాస్మెంట్‌. కాంతిరానా టాటా ఐపీఎస్‌. ఐజీ. విశాల్‌ గున్నీ సీనియర్‌ ఐపీఎస్‌ ఇద్దరూ సస్పెండెడ్, హరాస్మెంట్‌. 

జాషువా, ఐపీఎస్, ఎస్పీ. కేసులు పెట్టి హరాస్మెంట్‌. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్‌. రిషాంత్‌ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్‌. పోస్టింగుల్లేవు. అలా వేధిస్తున్నారు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. వీళ్లే అసెంబ్లీలో ఓ ప్రశ్నకు రిపై్లయ్‌ ఇచ్చారు. డీఎస్పీలు, సీఐలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. 


అసలు స్కామ్‌స్టర్‌ చంద్రబాబు కాదా?:

అసలు నిజమైన స్కామ్‌ స్టర్‌ ఎవరూ? చంద్రబాబు  కాదా?  2014–2019 మధ్య చేసిన లిక్కర్‌ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై లేడా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్‌ చెబుతా చూడండి. 

రాష్ట్రంలో 4380 లిక్కర్‌షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్‌ చేశారు. తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు, తన బినామీలు రిగ్గింగ్‌ చేసి తన మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. 

ఈ షాపులన్నింటిని ఒక సిండికెట్‌ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్‌గా పర్మిట్‌రూమ్‌లు. ఏకంగా 43 వేల బెల్ట్‌షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రై వేట్‌షాపుల సిండికేట్, ఈయనకు కావాల్సిన డిస్టరీలకు మేలు చేసే వి«ధంగా ఆర్డర్స్‌ చేశారు. తనకు కావాల్సిన కంపెనీలతో ఇండెంట్‌ ఇప్పించారు. 2015– 2019 మధ్యలో చంద్రబాబు ఐదు కంపెనీలకు 69 శాతం ఆర్డర్స్‌ దక్కాయి. 

కొన్ని బ్రాండ్లకు కృతిమ డిమాండ్లు సృష్టించారు. 2014 నవంబర్‌లో జీవో 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. తరువాత 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి ప్రైవేటు వైన్‌షాప్‌లు, బార్లకు లబ్ధి చేశారు. అందుకోసం 2015, డిసెంబర్‌ 11న జీవోను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌లో స్వయంగా చంద్రబాబే సంతకం చేశారు. మూడుసార్లు చంద్రబాబు సంతకం చేసి విత్‌ అవుట్‌ క్యాబినెట్‌ అప్రూవల్‌.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతూ చంద్రబాబు సంతకం చేసిన ఫైల్‌ను కాగ్‌ కూడా తప్పు పట్టింది. ఇవన్నీ ఉన్నా నేపథ్యంలో చంద్రబాబుపై బలమైన కేసు నమోదు అయ్యింది.

చంద్రబాబు ఆ కేసుపై ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాడు. ఆయనపై అప్పట్లో వచ్చిన ఆరోపణలు వచ్చిన దానిపై ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీపై ఫాల్స్‌ కేసు ఫైల్‌ చేయించారు. అదే తన పాత పాలసీ ప్రకారం స్కామ్‌ చేసుకునేందుకు మధ్యలో వైయస్‌ఆర్‌సీపీపై స్కామ్‌ జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ బ్రాండ్లు ఎప్పుడైనా చూశామా?:

ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో అంట.. కేరళా మాల్ట్‌ అంట ఎప్పుడన్నా చూశారా? షార్ట్‌ విస్కీ అంట  ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ అంట ఎప్పుడన్నా చూశారా? బావుండదని, పక్కన మళ్లీ బెంగళూరు బ్రాందీ.. రాయల్‌ ల్యాన్సర్‌ విస్కీ అంట ఎప్పుడన్నా విన్నారా? ఓల్డ్‌ క్లబ్‌ అంట ఎప్పుడన్నా చూశారా? గుడ్‌ ఫ్రెండ్స్‌ అంట.. ఎప్పడన్నా విన్నారా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా..

ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి?  ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్‌ చేస్తా ఉన్నారని నేను అడుగుతూ ఉన్నా.. ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తన కావాల్సిన డిస్టిలరీస్‌ కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు ప్లేస్‌ చేస్తా ఉన్నాడు. ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు.. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా?.


ధరలు తగ్గిస్తానని చెప్పి..:

తానొస్తే ధరలు తగ్గిస్తామన్నాడు.. తగ్గించింది లేదు కానీ. తీరా షాపులు తన మాఫియా చేతుల్లో పెట్టిన తర్వాత.. ప్రాసెస్‌ అంతా పూర్తయ్యాక వారికిచ్చే కమీషన్‌ పెంచాడు.. ఇది స్కాం కాదా? అని అడుగుతా ఉన్నా.  షాపులు ఇవ్వక మునుపు లేదు.. మాఫియాకు ఇచ్చిన తర్వాత కమీషన్‌ పెంచాడు.. మాఫియా కాక ఇంకేటని అడుగుతా ఉన్నా.

ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. ఇక్కడ విలేకరులు ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్లండి ఎక్కడన్నా ఎమ్మార్పీకి అమ్ముతున్నారా అని ఎంక్వైరీ చేయండి. ఇది స్కాం కాదా? హిస్టరీ ఆఫ్‌ ఏపీలో ఎప్పుడూ జరగలేదు. రూ.99 కే లిక్కర్‌ ఇస్తా అని చెప్పి.. ఏకంగా గతంలో కంటే లిక్కర్‌ క్వాలిటీ కంటే ఒక లెవల్‌ తగ్గించి అమ్ముతున్నారు. పాత రేట్లు.. పాత క్వాలిటీకి అట్టాగే పెట్టి.. కొత్త లిక్కర్‌ .. మళ్లీ క్వాలిటీ తగ్గించి రూ.99 అమ్ముతున్నారు. అది కూడా ఆ చీపెస్ట్‌ చీప్‌ లిక్కర్‌ కూడా పొరుగు రాష్ట్రాల్లో రూ.10 తక్కువ.


అన్నీ పబ్లిక్‌ డొమెయిన్‌లో..:

చంద్రబాబు హయాంలో ఇప్పుడు ఈ లిక్కర్‌ కు సంబంధించి.. పబ్లిక్‌ డొమెయిన్‌లో పెడుతున్నాం. వైయస్సార్‌ సీపీ హ్యాష్‌ ట్యాగ్‌.. వైయస్సార్‌ సీపీ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో నా పర్సనల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ లో 22 పేజీల డాక్యుమెంట్‌ పెడతాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. డౌన్‌ లోడ్‌ చేసుకోండి. మద్యం అక్రమాలు, రెడ్‌ బుక్‌ మీద కూడా ఇంగ్లిష్, తెలుగు వెనర్షన్‌ కాపీలు పెడతాం. 


కూటమి ప్రభుత్వ. అనైతిక పర్వం:

రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక  జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైయస్సార్‌ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63.

మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది.


అధికారులకు వేధింపులు:

టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్‌ఆర్‌ అంజనేయులు, డీజే ర్యాంక్‌ దళిత అధికారి సునీల్‌ కుమార్, అడిషనల్‌ డీజీ ర్యాంకు అధికారి సంజయ్‌ ఐపీఎస్, సీనియర్‌ ఆఫీసర్, ఐజీ ర్యాంక్‌ కాంతిలాల్‌ రాణా, ఐజీ ర్యాంక్‌ ఆఫీసర్‌ విశాల్‌ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, నిశాంత్‌ రెడ్డి ఐపీఎస్‌ లు, ఐపీఎస్‌ అధికారి పి.జాషువా,  వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్‌ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్, నావ్యక్తి గత ట్విట్టర్‌ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్‌ లోడ్‌ చేస్తాము.


జూన్‌ 4న ‘వెన్నుపోటు’ దినం:

చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక, అన్యాయాలపై గళమెత్తుతూ వచ్చే నెల 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నాం. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రజలతో కలిసి, ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగుల్ని మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రం ఇస్తూ నిరసన తెలిపే కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో అందరూ పాల్గొనాలని శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.


మీడియా ప్రశ్నలకు సమాధానంగా..


పోరాటాలు కొత్త కాదు:

ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుంది. వైయస్సార్‌ సీపీకి, జగన్‌ కు ఈ పోరాటాలు కొత్త కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హరాస్‌ చేస్తేనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది, పెరిగింది, జగన్‌ అనే వ్యక్తి ఎదిగాడు. ఈ పోరాటాలు మాకు కొత్తేం కాదు. 


స్కామ్‌ జరగకపోయినా..:

అంతిమంగా న్యాయం, ధర్మం ఏవైపు ఉంటే దేవుడు ఆవైపు ఉంటాడు. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ, ఇష్టమొచ్చినట్లుగా నువ్వు నీ కేసును నలిఫై చేసుకునే దాని కోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తున్న లిక్కర్‌ పాలసీని జస్టిఫై చేసుకునే దాని కోసం మధ్యలో ఏ స్కామూ లేకపోయినా చిత్రీకరించి, భేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం చేస్తే.. దాంట్లో ధర్మం, న్యాయం లేనప్పుడు దేవుడు ఆశీర్వదించడు, చంద్రబాబుకు గట్టిగా మొటిక్కాయలు పడతాయి. ఆయన ఎంత దుర్భుద్ధితో ఎంత చేసినా అతి తాత్కాలికమే. 

నేను విజయవాడలో ఉన్నాను. ఇఫ్‌ దే వాంట్‌.. దే ఆర్‌ వెల్కమ్‌. ఎవరు ఆపుతున్నారు? 


ఇప్పుడు రేషన్‌ దారి మళ్లుతుంది:

అసలు రేషన్‌ బియ్యం ఇంటింటికీ పంపిస్తేనే కనీసం నువ్వు చేప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్‌ బియ్యం అనేది ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? మొదట సార్టెక్స్‌ బియ్యాన్ని వీళ్లు ఆపేశారు. క్వాలిటీ పెంచి మేం సార్టెక్స్‌ బియ్యం ఇస్తుంటిమి. దానివల్లనూకలు తక్కువ ఉండేవి. మధ్యస్త, సన్నకార, స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్‌ చేస్తుంటిమి. దాని వల్ల తినేవాళ్లు ఉత్సాహం చూపేవారు. వీళ్లెవరూ ఇబ్బంది పడకుండా ఇంటి వీధి చివరికి పోయి అక్కడే డెలివరీ చేసేవారు. 

సాయంత్రంపూట సచివాలయం వద్ద బండి పెట్టుకుని అవైలబుల్‌ గా ఉండేవారు. ఎవరైనా మిస్‌ అయితే. ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా ఇంటికే వచ్చి ఇస్తుంటే తీసుకునేవారు తీసుకుంటారు. ఎవడో రేషన్‌ షాపు డీలర్‌ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి, ఆ రేషన్‌ షాపు డీలర్‌ తెలుగుదేశం పార్టీవాడు అయ్యుంటాడు. 

వాడు వైసీపీ పార్టీనో ఇంకో పార్టీనో పోతే ఇవ్వడు. సతాయిస్తాడు. నా ఇంటికి రావాలి అంటాడు, సెల్యూట్‌ కొట్టాలంటాడు. అప్పుడే ఇస్తానంటాడు. ఎందుకొచ్చిన బాధలే అని పోరు. సో బియ్యం ఆటోమేటిగ్గా మిగులుతుంది. వీళ్లు చేసేది మాఫియా. ఇంటికి పోయి డోర్‌ డెలివరీ చేసేది ఒక సర్వీసు. ఆ సర్వీసును తీసేయడం వీళ్లు చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ తప్పును యాక్సెప్ట్‌ చేయకుండా, దానికి సారీ చెప్పకుండా దానిమీద కూడా దుర్బుద్ధితో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. 

నీ ఇంటి దగ్గరికి బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే నీ డీలర్‌ దగ్గరకి పోయి తీసుకోమంటే వాని టైమింగ్‌ ప్రకారం నువ్వు పోయి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతావా. ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల వ్యవస్థపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది?


అందుకే ఆ మాటలు:

విజయవాడ, గన్నవరం ఎయిర్‌ పోర్టుల మధ్య 40 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అమరావతి ఏయిర్‌ పోర్టు అన్నది వర్క్‌అవుట్‌ కాదు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ హైప్‌ చేసేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారు. చంద్రబాబు తన బినామీలకు మేలు చేసేందుకు ఇలాంటి హామీలు ఇస్తున్నారు.


డైవర్షన్‌ పాలిటిక్స్‌:

కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీల ఊసే లేదు. విద్యార్థులకు ఫీజులు అందడం లేదు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు. 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం లేదు. ఇలాంటి హామీలు అమలు చేయడం లేదు కాబట్టే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీని నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపారు.


అప్రకటిత ఎమర్జెన్సీ:

నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అందుకే ఐఏఎస్‌లే కాదు, ఐపీఎస్‌లు కూడా మీటింగ్‌ పెట్టుకోవాలి. చంద్రబాబు అనే వ్యక్తి బెయిల్‌పై ఉండి, తన కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేశాడు. అందుకే ఇప్పుడు ఆయనను ఎందుకు అరెస్టు చేయకూడదు? ఆయన బెయిల్‌ కండిషన్లు ఉల్లంఘిస్తున్నాడు.

Comments