గుంటూరు (ప్రజా అమరావతి);
జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో ఒక ప్రకటన చేస్తూ, జగన్ ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది ఆన్ లైన్ డేటా బేస్ తయారు చేసేటప్పుడు, షెడ్యూల్ క్యాస్ట్ నుంచి మారిన క్రైస్తవులను, చాలామంది పాస్టర్లను కూడా ఎస్సీ హిందువులుగా నమోదు చేశారని, నేను సేకరించిన సమాచారం ప్రకారం సుమారు 70 శాతం సచివాలయ సిబ్బంది, ప్రజల వివరాల ను అడగకుండానే, ఓటిపి అడిగి సిబ్బంది కి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎంటర్ చేసేసారు, కొన్నిచోట్ల ప్రజల దగ్గరికి వెళ్లి సమాచారం అడిగినప్పుడు, తాము పాస్టర్ లేదా క్రైస్తవులము, అని చెప్పినప్పుడు, మీరు క్రైస్తవులనీ సర్టిఫికెట్ చూపించమని అడగడం, కొంతమంది క్రైస్తవులుగా సర్టిఫికెట్ చూపించినప్పటికిని, మీరు అంతకుముందు దేని నుంచి మారారని, హిందూ మతం నుంచి మారామని చెప్పినప్పుడు, ఆ మొదటిది మేము రాస్తామని, హిందువులుగా రాసేశారు. ఈ సమస్య అప్పుడే మా దృష్టికి వచ్చినప్పుడు సచివాలయ సిబ్బందిని అడగగా, పై అధికారుల నుంచి అలాగ రాయమని మాకు చెప్పారని చెప్పారు. దీనంతటికీ కారణం షెడ్యూల్ కులాల క్రైస్తవులు, బీసీసీ కేటగిరిలోకి వెళ్లిపోతారని, వారు ఎస్సీ హిందువు కేటగిరీ క్రింద చూపిస్తే, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయని అలా చేశారని తెలిసింది, దీని మూలంగా జగన్ ప్రభుత్వం లాభపడింది కానీ, క్రైస్తవులు ఇరుక్కుపోయారు. ఇంతకుముందు ఎమ్మార్వో గారు పరిశీలన చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోవడంతో, ఆధార్ నెంబర్ కొట్టినప్పుడు, వారు ఎస్సీ హిందువులుగా చూపించడంతో, ఎమ్మార్వో క్రైస్తవులుగా నమోదు చేయడానికి కలెక్టరేట్లోని, వార్డు సచివాలయ డేటా బేస్ సెక్షన్ కి, రాయాల్సి వస్తుందని, అక్కడ డేటా బేస్ లో మారిస్తే తప్ప ఎమ్మార్వో గారు బిసిసిలుగా సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి, ఈ మధ్యనే ఒక పాస్టర్ గారు వారి పిల్లలకు నాలుగు నెలలైనా బిసిసి సర్టిఫికెట్ ఇవ్వలేదని, నాకు చెప్పినప్పుడు నేను ఎమ్మార్వో గారితో మాట్లాడితే, ఈ విషయం బయట పడింది, ఇంకొక ఘటనలో పాస్టర్ గారు పోలీస్ స్టేషన్లో తనను కొట్టి దాడి చేసిన వారి మీద, కేసు పెట్టాలనుకున్నప్పుడు ఆధార్ నెంబర్ బట్టి, ఎస్సి హిందువుగానే, కేసు నమోదు చేయటం వలన, పాస్టర్ గారు, SC హిందూ ఎలా అవుతాడని కేసు కొట్టేసిన పరిస్థితి.
జగన్మోహన్ రెడ్డి మా వాడు అనుకుని 98% మంది ఓట్లు వేస్తే, క్రైస్తవ సమాజానికి మేలు చేయకపోగా, ఘోరమైన అన్యాయం చేశాడని, ఇప్పటికైనా క్రైస్తవ సమాజం గ్రహించాలని ప్రొఫెసర్ జోసఫ్ సూచించారు, చర్చికి వెళ్లే షెడ్యూల్ కులముల వారు మరియు పాస్టర్స్ క్రైస్తవులుగా నమోదు చేయించుకోవాలి అనుకునేవారు, ఎమ్మార్వో ఆఫీస్ కెళ్ళి చెక్ చేసుకోవాలని, ఎస్సీ హిందువులుగా ఉంటే మరలా అప్లై చేసుకుని మార్పించుకోవాలని, దీనికి కొంచెం టైం పడుతుంది కనుక ముందే మేల్కోవాలని రాష్ట్రంలోని క్రైస్తవ సమాజాన్ని ప్రొఫెసర్ జోసెఫ్ కోరారు. క్రైస్తవ సమాజం ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే, ఉచిత కార్యాలయం ఏర్పాటు చేశాం, 70754 82182 ఫోన్ నెంబర్ కి కాల్ చేయవచ్చని లేదా
https://jbac.in/entry
వెబ్ సైట్ లో వారి సమస్య నమోదు చేసుకుంటే, పరిష్కారం అయ్యేటట్టు, అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళతాము.
addComments
Post a Comment