సిఎస్ తో భేటీ అయిన ఎస్బిఐ సిజియం బృందం


 సిఎస్ తో భేటీ అయిన ఎస్బిఐ సిజియం బృందం

అమరావతి,3 నవంబరు (ప్రజా అమరావతి):స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా  వారి అధికారుల బృందం గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మతో భేటీ అయింది.ఈసందర్భంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేస్తున్న వివిధ రుణ సౌకర్యాలకు సంబంధించిన పధకాలు,బీమా పధకాలు, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి సిజియం నవీన్ చంద్ర ఝా సిఎస్ కు వివరించారు.అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవల గురించి వివరించారు.

ఈసమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్ధికశాఖ కార్యదర్శి డా.కెవివి. సత్యనారాయణ,పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ పాల్గొన్నారు.అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్లు దినేష్ గులాటి,రంగరాజన్, ఫంకజ్ కుమార్,ఎజియంలు పి.విశ్వేశ్వరరావు,సత్య స్వరూపిణి,సచివాలయం ఎస్బిఐ మేనేజర్ సిఎస్ నాయుడు,అసోసియేట్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

      

Comments