తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైకాపా డేగల కన్ను.

అమరావతి (ప్రజా అమరావతి);

*తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైకాపా డేగల కన్ను*

*బంజారాల ఆరాధ్య దైవమైన హథీరాంజీ ట్రస్టు పవిత్రను దెబ్బతీసేలా వైకాపా నాయకులు*

*ట్రస్టు భూముల్లో ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం*

-ఎం. ధారు నాయక్

రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు

తిరుపతికి చెందిన జంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైకాపా నాయకత్వం తలమునలైంది. ట్రస్టుకు చెందిన వందలాది ఎకరాల భూములపై వైకాపా నాయకుల డేగ కళ్లు పడ్డాయి. వైకాపాకు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డిలు కలిసి ట్రస్టు భూములను దోచుకోవాలని చూస్తున్నారు. 1843 నుంచి ఎంతో ప్రసిద్ది చెందిన హధీరాంజీ మఠానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంజారా/లంబాడీ/సుగాలీలు దర్శనం చేసుకుంటారు. అంతటి చరిత్ర కలిగిన ట్రస్టుపై వైసీపీ నాయకుల కన్ను పడటం దురదృష్టకరం. ట్రస్టుకు తెలుగురాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. ట్రస్టు మహంతు అర్జున్‌దాసుపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను అన్యాయంగా తొలగించి ట్రస్టు ఆస్తులను వైకాపా నాయకులు దోచుకుంటున్నారు. 

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 350 ఎకరాలు మఠం భూములను నారాయణ స్వామీ, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి,  మధుసూదన్ రెడ్డిలు భూముల్లో ప్లాట్లు వేసి వాటిని అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవిలాల పంచాయతీలోని సర్వే నెం.135.139.253.238, 12.321 17/2 17/5 148/2 లోని 45 ఎకరాలు కబ్జా చేశారు. చంద్రగిరి మండలం, అగరాల గ్రామంలోని సర్వేనెంబర్ 140.71, 134.110/1 లలో గల 40 ఎకరాలు, మంగళంలోని సర్వే నెం. 216, 86.109 లలోని రెండు ఎకరాలు, పేరూరులోని సర్వేనెంబర్ 173, 171లలోని 10 ఎకరాలు, పుదీపట్ల గ్రామపంచాయతీలోని  సర్వేనెంబర్ 51/1 377.382లలో  40 ఎకరాలను ఇప్పటికే కబ్జా చేశారు. వైకాపా ప్రభుత్వం మఠం అభివృద్ధిని గాలికి వదిలేసి భూములను దోచుకోవాలని చూడటం దుర్మార్గం. వైకాపా నాయకుల భూ కబ్జాలకు సహకరిస్తూ చట్ట వ్యతిరేకంగా పనులకు పాల్పడుతున్న అధికారులు కూడా శిక్షార్డులే గమనించాలి. అధికారులు వైకాపా నాయకుల ప్రలోభాలకు తలొగ్గకుండా మఠం ఆస్తులను కాపాడాలని హెచ్చరిస్తున్నాం.

Comments