ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయస్థాయి పోరాటం.

 ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయస్థాయి పోరాటం. 


జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యల పై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటం. 

నియోజకవర్గాల వారీగా టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశాలు. 

వైసిపి పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశాలు. 

జగన్ పాలనలో ఎస్సి,మైనార్టీలకు జరిగిన సామాజిక అన్యాయాన్ని ఎండగట్టడం. 

టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న ఓటరులిస్టు అవతకవకలను రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోని పరిస్థితుల్లో ఈ అంశంపై జాతీయస్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సిఇసి) దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.  ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, ఎంఎ షరీఫ్, బిసి జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, రామానాయుడు, అశోక్ బాబు  పాల్గొన్నారు. ఓటరులిస్టులో  అవకతవకలను బయటకు తీసి రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా స్పందించకపోవడంతో, లోపాలను సరిదిద్దేంధుకు కేంద్ర ఎన్నికల సంఘంపై వత్తిడితేవాలని సమావేశం నిర్ణయించింది. 

1).ఇందులో భాగంగా ఎంపిలు, పార్టీ ముఖ్యనేతలు త్వరలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కలవాలని నిర్ణయించారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం జాతీయస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అధికారపార్టీ చేస్తున్న అక్రమాలపై సిఇసికి ఫిర్యాదు చేయాలని, నియోజకవర్గాల వారీగా అక్రమాలపై నేరుగా సిఇసికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రేపు జరగబోయే టిడిపి జనసేస సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి న్యాయపోరాటానికి పార్టీతరపున న్యాయసహాయం అందించాలని నిర్ణయించారు. 

2).ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. టిడిపి-జనసేన పార్టీలు నియోజకవర్గ స్థాయిల్లో ఉమ్మడి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్లు, వైసిపి హయాంలో జరుగుతున్న దోపిడీపై ఆయా సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. ఇరుపార్టీలు కృష్ణాజలాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, కరువు వంటి అంశాలపై నియోజకవర్గ స్థాయిల్లో పోరాడాలని నిర్ణయించారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య, విద్యుత్ ఛార్జీల పెంపు, రోడ్లు, పేదల గృహనిర్మాణంలో అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇసుక దోపిడీ వంటి అంశాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల తరపున పోరాడాలి అని నిర్ణయించారు. 

3).రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండను జాతీయ స్థాయిలో ఎండగడుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రత్యేక కార్యక్రమం తో పాటు, భారీ దళిత గౌరవ సభ నిర్వహించాలని, ఎస్సీ హక్కుల కోసం పోరాడే వారందరినీ ఈ సమావేశాలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల హత్యలు, స్కీముల రద్దు, దళితులపై వేధింపులు వంటివాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలని, ఇందుకోసం త్వరలోనే ఎజెండా, విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు. 

4).జగన్మోహన్ రెడ్డి పాలనలో బిసిలకు జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా 25పార్లమెంటు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, బిసి సంఘాలు, తటస్థులను ఈ సమావేశాల్లో భాగస్వాములుగా చేయాలని సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు బిసి సాధికార సమితి సభ్యులంతా సంబంధిత కులాలవారీతో సమావేశాలు నిర్వహించి ఆయా కులాలకు గత నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో జరిగిన అన్యాయంపై చైతన్యవంతం చేయాలి. ఇప్పటివరకు 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యాయి. 

5).రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు జరుగుతున్న అన్యాయం, దాడులపై మతపెద్దలు, తటస్థులు, మైనారిటీల హక్కుల కోసం పోరాడే సంఘాలతో కలిపి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలోని మైనారిటీ ముఖ్యనేతలు నాలుగు బృందాలుగా ఏర్పడి 100రోజుల యాక్షన్ ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. మైనారిటీలతో సమావేశాలు, బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు.

6). భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం పై సమావేశంలో చర్చించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఒక్కో కుటుంబానికి జరిగే మేలు ని వివరిస్తూ రూపొందించిన బాండ్స్ ని ప్రజలకి అందజేయడం, ప్రజల కు అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడం లాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించే వారిని గుర్తించి అభినందించాలని నిర్ణయించారు.

Comments