జల్సాల కోసం రైతులకు టోకరా..

 శ్రీ సత్య సాయి జిల్లా  (ప్రజా అమరావతి);




*జల్సాల కోసం రైతులకు టోకరా..



*రైతులను మోసగించి ట్రాక్టర్లను తీసుకెళ్లిన కేసును సత్వరమే చేదించిన శ్రీ సత్యసాయి జిల్లా  పోలీసులు..


*శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో..


*పోలీస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు...


*ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్...


*57 ట్రాక్టర్లు స్వాధీనం...


**రూ,4, కోట్ల 56,00,000 లక్షల విలువ...


*మీడియాకు వివరాలు వెల్లడించిన ..జిల్లా ఎస్పీ


*పోలీసులను సంప్రదిస్తే సత్వరమే న్యాయం 


*ట్రాక్టర్ల ఫిర్యాదు  ఇందుకు నిదర్శనం.. జిల్లా ఎస్పీ..



జల్సాల కోసం రైతుల వద్ద ఉన్న ట్రాక్టర్లను లీజుకు తీసుకొని  వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ ,రైతులను మోసం 

చేసిన కేసులో రైతుల నుండి ఫిర్యాదు అందడంతో పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు , రూ ,4,56,00,00 లక్షల విలువచేసే ,57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారు మీడియాకు వెల్లడించారు.


బుధవారం తాడిమర్రి పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులతో కలిసి, ఎస్పీ గారు మీడియాకు వివరాలు వెల్లడించారు..



   తాడిమర్రి గ్రామానికి చెందిన రైతు దేవర రామమోహన్ ఇచ్చిన పిర్యాదు మేరకు 


**అరెస్టు నేపథ్యం..


బొమ్మిరెడ్డిపల్లి గ్రామము, నల్లచెరువు మండలానికి చెందిన నల్లజంగరి రవికుమార్, పులివెందుల టౌన్  కు చెందిన లోమడ బయారేడ్డి లు   రెండు ట్రాక్టర్ లు 


మరియు తాడిమర్రి, కనేకల్ మండలానికి చెందిన మరికొంతమంది రైతుల వద్దనుండి ప్రొద్దుటూరులో NRK Brik Indastries లో పని చేయటానికి లీజుకు ట్రాక్టర్ లు కావాలని రైతులను నమ్మించి 


వారి వద్దనుండి ట్రాక్టర్ లను లీజు పేరుతో మోసం చేసి సదరు ట్రాక్టర్ లను పులివెందుల పరిసర ప్రాంతాలలో వాటిని అమ్మి, రైతులకు అనుమానం రాకుండా వారికి మూడు నెలల పాటు నెలకు 25,000 రూపాయల ప్రకారం ఇచ్చారని, 


 తరువాత రైతులకు కనబడకుండా తప్పించుకుని తిరుగుతుండగా 


 . ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు రవికుమార్, బయారేడ్డి లను పట్టుకుని విచారించగా,


 వీరితో పాటు  కాకర్ల హాజిపిరా,  బోగిరెడ్డి చంద్ర  ఓబులరెడ్డి,


 పెసల నాగమల్లారెడ్డి ,తలారి  రామలింగేశ్వరరావు, 


 చిన్న  జయచంద్ర రెడ్డి ,  మధుసూదన రెడ్డి,

  సాకే రామమోహన్,

 సుదర్శన్ రెడ్డి లు ఒక ముఠాగా ఏర్పడి 


 ఉమ్మడి అనంతపురం సత్య సాయి జిల్లాలో అనేక గ్రామాల రైతుల వద్ద నుండి ట్రాక్టర్ లను లీజుకు తీసుకుని వాటిని కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, గుంటూరు జిల్లాలలోని వివిధ గ్రామాలలో తక్కువ రేటుకు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని వారుతో అగ్రిమెంట్ వ్రాసుకుని తరువాత రిజిస్టర్ చేయిస్తామని వారిని కూడా  మోసగించారని, 


 వచ్చిన డబ్బుతో  అందరు పంచుకునే వాడలు పంచుకున్నారన్నారు.


పోలీసుల  విచారంలో భాగంగా ముద్దాయిలు ఇతర  జిల్లాలలోని ట్రాక్టర్ లను అమ్మిన వ్యక్తుల వద్ద నుండి 57 ట్రాక్టర్ లను రికవర్ చేయడం జరిగిందన్నారు.,


 వాటి విలువ సుమారు రూ, 4,56,00,000 రూపాయలు (అక్షరాల నాలుగు కోట్ల, యాభై ఆరు లక్షల రూపాయలు) ఉంటుంది.


2024 వ సంవత్సరము ఏప్రిల్ నెల 17 వ తేదీ ఉదయం 11.00 గంటల సమయములో తాడిమర్రి మండలం దాడితోట చెక్ పోస్ట్ వద్ద ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడమైంది.


*ముద్దాయిల వివరాలు..


1). నల్లజంగరి రవికుమార్,వయస్సు 42 సంవత్సరాలు, తండ్రి నారాయణ,బొమ్మిరెడ్డిపల్లి గ్రామము, నల్లచెరువు మండలము, శ్రీ సత్య సాయి జిల్లా,


2). లోమడ బయారేడ్డి వయస్సు 48 సంవత్సరాలు తండ్రి  రామసుబ్బారెడ్డి, మెయిన్ రోడ్,పవర్ ఆఫీస్ ఎదురుగా,పులివెందుల టౌన్.



3)కాకర్ల హాజిపిరా వయస్సు 65  సంవత్సరాలు తండ్రి కాకర్ల హాజీ, లోమడ గ్రామము,సింహాద్రిపురము మండలము, కడప జిల్లా


ఈ కేసులో వీరితో పాటు ముద్దాయిలు :- 

4) బోగిరెడ్డి చంద్ర  ఓబులరెడ్డిని,వయస్సు 50 సంవత్సరములు తండ్రి late నడిపి గురివిరెడ్డి,

, కందిమల్లయ్యపల్లి.గ్రామము, బ్రహ్మం గారిమటము మండలము,YSR కడప జిల్లా,


5) పెసల నాగమల్లారెడ్డి తండ్రి రామిరెడ్డి, మద్దిరెడ్డిపల్లి గ్రామము,  H/O సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమటం మండలము YSR కడప జిల్లా


6) తలారి  రామలింగేశ్వరరావు,  చిన్నతండ్రి T.రామారావు, శ్రీనివాసపురం గ్రామము, గోస్పాడు మండలము  నంద్యాల జిల్లా,


 7) జయచంద్ర రెడ్డి తండ్రి నరసింహారెడ్డి చాక వేలు గ్రామము,చోలూరు తాలుకా,చిక్బలాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం 


8) ) మధుసూదన రెడ్డి తండ్రి వెంకటరమణ రెడ్డి తీగలపల్లి గ్రామము, పతపాల్యం హుబ్లి, చిక్బలాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం



9)  సాకే రామమోహన్ తండ్రి లేట్ గంగాద్రి, వంకమద్ది గ్రామము,  NP కుంట మండలము,శ్రీ సత్య సాయి జిల్లా  



10) సుదర్శన్ రెడ్డి, తండ్రి లక్ష్మిరెడ్డి, యాలురు గ్రామము, గోస్పాడు మండలము నంద్యాల జిల్లా,


11)  పాణ్యం మల్లిఖార్జున రెడ్డి,తండ్రి ఓబుల రెడ్డి, చెన్నంపల్లి గ్రామము, ఆవుకు మండలము, నంద్యాల జిల్లా 


ఎస్పీ గారు మాట్లాడుతూ..

కొందరు వ్యక్తులు తమ జలసాల కోసం మోసాలు చేస్తుంటారని ఎవరు ఇలాంటి ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్త పడాలని,

రైతులకు ఏ సమస్య వచ్చినా పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని పోలీసులు సంప్రదిస్తే సత్వరమే న్యాయం చేస్తామని, ఎస్పీ గారు తెలిపారు. 


అభినందించిన ఎస్పీ గారు..


ఈ  కేసులోని ముద్దాయిల నుండి 57 ట్రాక్టర్లను స్వాదినపరచుకొవడంలో ప్రతేక బృందంను ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే  ఈ కేసును చేదించిన  ధర్మవరం DSP T.శ్రీనివాసులు , ముదిగుబ్బ రూరల్ CI శ్రీ H.కృష్ణంరాజు నాయక్ , తాడిమర్రి SI  M.నాగస్వామి , ASIలు వన్నప్ప ,సూర్యనారాయణ, రాజు , HCs చంద్ర శేఖర్ రెడ్డి, నాగరాజు, PCs రమేష్, యాసిన్,అనిల్, CAT team సబ్యులు శ్రీనివాసులు, రవి, చంద్రశేఖర్ రెడ్డి లను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారు అభినందించారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ సిఐ హేమంత్ కుమార్ పాల్గొన్నారు


Comments