రాష్ట్ర భవిష్యత్తును ప్రజలే మార్చగలరు..

 

*సినీ నటుడు నారా రోహిత్ విలేకరుల సమావేశం వివరాలు*


*ఎన్డీఏ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది*


*ప్రజల ఆస్తులను కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు*


*రాష్ట్ర భవిష్యత్తును ప్రజలే మార్చగలరు..*



*సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది*



- *నారా రోహిత్*


పుట్టపర్తి  (ప్రజా అమరావతి):- ఎన్డీఏ గెలుపే లక్ష్యంగా రాష్ట్రమంతటా ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ పర్యటిస్తున్నారు. శుక్రువారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడుతూ..  రాష్ట్రం విడిపోయింది, మనకు రాజధాని లేదు, కానీ చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని మనం కల్లారా చూశాం. అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, యువత జీవితాలు బాగుపడతాయి. అవన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్డీఏ మ్యానిఫెస్టో రూపొందించబడింది. మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభించింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. రాష్ట్రానికి కియా లాంటి పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. తద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు ఏర్పడితేనే రాష్ట్రానికి ఆదాయం వస్తది.  రాష్ట్రానికి ఆదాయం ఉంటేనే అప్పు చేయకుండానే ప్రజలకు సంక్షేమాన్ని అందించగలం.  జగన్ రెడ్డి పాలనలో  రాష్ట్రానికి ఆదాయం లేదు.  పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమం అదించడం అంటే ప్రజలపై అప్పుల భారం మోపినట్లే..! ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనో రాష్ట్రం దారుణంగా వెనుకబడిపోయింది. చంద్రబాబు చేసిన అభివృద్ధి నిలిచిపోయింది.  కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు. అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చేసి దమనకాండను మొదలుపెట్టారు. ప్రతి ఒక్కిరిని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టారు. అధికారం దిగిపోయేనాటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకర యాక్ట్‌ను తీసుకువచ్చారు. దాని వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. రాష్ట్ర భవిష్యత్తును ప్రజలే రాయగలరని నమ్ముతున్నాను” అని వ్యక్తం చేశారు.


*సమాజాభివృద్ధిలో జర్నలిస్టు పాత్ర గొప్పది : నారా రోహిత్*

“ప్రజాక్షేత్రానికి జర్నలిస్టు ఎంతో ముఖ్యం. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరపునుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమైనది. ప్రతినిధి సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది.  రాష్ట్ర భవిష్యత్తు ఎలా మర్చగలదో ప్రతినిధి-2 ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాం. ప్రతినిధి-2 సినిమా చూస్తే ఓటు ఎంత ముఖ్యమైనదో, అందరి భవిష్యత్తులను ఎలా మార్చగలదో సినిమా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం” అని నారా రోహిత్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు తాడికొండ సాయి కృష్ణ పాల్గొన్నారు.

Comments