*పిల్లలతో కలిసి తల్లి గూడ్స్ రైలుకు ఎదురెళ్ళిన ఘటనలలొ ముగ్గురు మృతి
*
ప్రకాశం (ప్రజా అమరావతి);
*రెండు ఘోర విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి.* బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా.. చిన్నగంజాం సోపిరాల రైల్వే గేటు సమీపంలో ఓ తల్లి తన కుమార్తె, కుమారుడుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు సంఘటనలతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిన్నగంజాం సోపిరాల రైల్వే గేటు సమీపంలో ఓ తల్లి తన కుమార్తె, కుమారుడుతో కలిసి మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా మృతదేహాల ఖండాలతో భయానకంగా మారింది. అభం శుభం తెలియని ఆ బిడ్డల వయసు నాలుగైదు సంవత్సరాలలోపే ఉంటుంది. మృతదేహాలను చూసి గ్యాంగ్మెన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
addComments
Post a Comment