రాగుల సాగును రెట్టింపు చేయాలి.

 


రాగుల సాగును రెట్టింపు చేయాలి


జులై నుంచి ఫోర్టిఫైడ్ గోధుమ‌పిండి పంపిణీ

ధాన్యం మిల్లులో డ్ర‌య్య‌ర్‌, సిసి కెమేరాలు ఏర్పాటు

గ్యాస్ సిలండ‌ర్ల స‌ర‌ఫ‌రాకు అద‌నంగా వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు

మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కారుమూరి నాగేశ్వ‌ర్రావు

చిరుధాన్యాల సాగు, ధాన్యం సేక‌ర‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష‌


విజ‌య‌న‌గ‌రం, జూన్ 27 (ప్రజా అమరావతి) ః

                   రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర్రావు అన్నారు.  దీనిలో భాగంగానే రేష‌న్ డిపోల ద్వారా రాగులు, జొన్న‌ల‌ను పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి నిర్ణ‌యించారని చెప్పారు.


                   చిరుధాన్యాలు, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఉత్త‌రాంధ్ర జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్లు, పౌర స‌ర‌ఫ‌రాలు, విజిలెన్స్, తూనిక‌లు కొల‌తలు, వ్య‌వ‌సాయ శాఖాధికారుల‌తో, విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్‌, పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌ ఎండి వీర‌పాండ్య‌న్ మాట్లాడుతూ, చిరుధాన్యాల సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని, ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రించారు.  త‌మ‌త‌మ జిల్లాల్లోని చిరుధాన్యాలు ముఖ్యంగా రాగిపంట‌ సాగు, దాని విస్త‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్లు పిపిటి ద్వారా వివ‌రించారు. పంట విస్త‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

            అన్ని జిల్లాల్లో రాగుల సాగును రెట్టింపు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి కారుమూరి ఆదేశించారు. ప్ర‌భుత్వం రాగుల‌కు రూ.3,480 చొప్పున‌ మంచి గిట్టుబాటు ధ‌ర‌ను అందిస్తోంద‌ని, దీనిని రైతులు స‌ద్వినియోగం చేసుకొని, రాగుల‌ను సాగు చేయాల‌ని కోరారు. ఎంత పండిస్తే అంతా కొనుగోలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గినంత‌గా రాగులు, జొన్న‌లు సాగవ్వ‌డం లేద‌ని, వీటి సాగును గ‌ణ‌నీయంగా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భ‌లుతున్న షుగ‌ర్‌, బిపి లాంటి జీవ‌న‌శైలి వ్యాధుల నియంత్ర‌ణ‌కు చిరుధాన్యాల వినియోగం చాలా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.


*వ‌రుణుడు త‌మ‌వెంటే...*

                    ఈ సమావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఒక‌ప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రాగిపంట సాగు ఎక్కువ‌గా ఉండేద‌ని అన్నారు. సాగునీటి స‌దుపాయాలు పెరిగిన కార‌ణంగా, రాగి స్థానంలో వ‌రి, ఉద్యాన పంట‌ల సాగు పెరిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుత అవ‌స‌రాల రీత్యా రాగి సాగును పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  రైతు శ్ర‌మ‌కు త‌గిన గిట్టుబాటు ధ‌ర‌ను క‌ల్పించి, పూర్తి స‌హ‌కారాన్ని అందించిన‌ప్పుడే రాగుల సాగు పెరుగుతుంద‌ని సూచించారు. ఆ దిశ‌గా అధికారులు యోచ‌న చేసి, రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. ఈ విష‌యంలో వ్య‌వ‌సాయాధికారులదే కీల‌క పాత్ర అని అన్నారు. ఏ పంట లాభ‌దాయ‌క‌మో, దానిని ఎంచుకొనే స్వేచ్చ రైతుకు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అతిత‌క్కువ పెట్టుబ‌డితో రాగిని సాగు చేయ‌వ‌చ్చ‌ని, భారీ తుఫానులు వ‌స్తే త‌ప్ప ఈ పంట‌కు న‌ష్టం వాటిల్ల‌ద‌ని అన్నారు. పంట దిగుబ‌డిని పెంచితే, సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంద‌ని సూచించారు.

                   ధాన్యం మిల్లుల్లో సిసి కెమేరాలు, డ్ర‌య్య‌ర్ల ఏర్పాటు కోసం రుణ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని సూచించారు. చెల్లించిన బ్యాంకు గ్యారంటీల‌ను బ‌ట్టి కాకుండా, మిల్లింగ్ చేసే సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టే,  రైస్ మిల్లుల‌కు ధాన్యం కేటాయించాల‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గ‌త ఏడాది జిల్లాలో ధాన్యం దిగుబ‌డి గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఎటువంటి ఇబ్బందీ రాకుండా, ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను చ‌క్క‌గా పూర్తి చేశార‌ని, అధికారుల‌ను మంత్రి అభినందించారు. ఈ ఏడాది కూడా ఎటువంటి స‌మ‌స్యా ఉత్పన్నం కాకుండా, ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని కోరారు. వ‌రుణుడు త‌మ పార్టీలో చేరిపోయాడ‌ని, అందువ‌ల్లే ఈ నాలుగేళ్లూ స‌కాలంలో వ‌ర్షాలు ప‌డి, పంట‌లు బాగా పండుతున్నాయ‌ని బొత్స చ‌మ‌త్క‌రించారు.


*జులై నుంచి గోధుమ‌పిండి పంపిణీ*

                జులై నుంచి రాష్ట్రంలోని అన్ని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కిలో రూ.16 చొప్పున ఫోర్టిఫైడ్ చెక్కి గోధుమ‌పిండిని రేష‌న్ డిపోల ద్వారా పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర్రావు తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండిని పంపిణీ చేయ‌డానికి, ముఖ్య‌మంత్రి యోచిస్తున్న‌ట్లు చెప్పారు. పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి వినూత్న‌మైన మార్పుల‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు.  ధాన్యం కొనుగోలు వ్య‌వ‌స్థ‌ను పూర్తి పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, గ‌త సీజ‌న్‌లో 98 శాతం మందికి డ‌బ్బులు జ‌మ చేశామ‌ని చెప్పారు. గోనె సంచులు, ర‌వాణా ఛార్జీల‌ను కూడా చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తీ ధాన్యం మిల్లులో త‌ప్ప‌నిస‌రిగా డ్ర‌య్య‌రు, సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. దీనివ‌ల్ల రాష్ట్ర‌స్థాయి నుంచే మిల్లుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. వ‌చ్చే సీజ‌నులో మూడు లేదా నాలుగు రోజుల్లోనే ధాన్యం డ‌బ్బులు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ ప్ర‌క్రియ‌ ద్వారానే ధాన్యం కొనుగోలు చేయ‌మ‌ని  రైతులు అడుగుతున్నార‌ని, ఇది త‌మ ప్ర‌భుత్వంపై ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. గిరిజ‌నులు పండించే చిరుధాన్యాల‌ను సంత‌ల్లో కూడా సేక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం కందిప‌ప్పు ల‌భ్య‌త అంత‌గా లేద‌ని, ఆగ‌స్టు నుంచి దీనిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ఎక్క‌డైనా రేష‌న్ స‌రుకుల‌కు అధిక ధ‌ర‌లు వ‌సూలు చేసినా, ఎండియు వాహ‌న‌దారులు అక్ర‌మాల‌కు పాల్ప‌డినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. గ్యాస్ సిలండ‌ర్ ను ఇంటికి స‌ర‌ఫ‌రా చేసేందుకు, తూకంలో మోసాల‌కు పాల్ప‌డినా, అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  ఆదేశించారు. అదే స‌ర్కిల్‌లో స‌ర‌ఫ‌రా చేసే గ్యాస్ సిలండ‌ర్‌కు అద‌న‌పు ఛార్జీల‌ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గోధుమ పిండి పంపిణీని మంత్రులిద్ద‌రూ ఈ సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించారు.

             

                 ఈ స‌మావేశంలో రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్‌, పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌ ఎండి వీర‌పాండ్య‌న్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, శ్రీ‌కాకుళం జెసి న‌వీన్‌కుమార్‌, అన‌కాల‌ప‌ల్లి జెసి జాన్వీ, ఆరు జిల్లాల పౌర స‌ర‌ఫ‌రాల అధికారులు, ఫౌర స‌ర‌ఫ‌రాల సంస్థ జిల్లా మేనేజ‌ర్లు, విజిలెన్స్‌, తూనిక‌లు కొల‌తలు, వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.                


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image