అవ‌య‌వ‌ దానంపై నూత‌న విధానం రావాలి.

 *అవ‌య‌వ‌ దానంపై నూత‌న విధానం రావాలి*


*కొరత వల్ల అవ‌య‌వ‌దానం,మార్పిడిలో అక్ర‌మాలు*

*కొత్త విధానంతోనే పేద రోగుల‌కు మేలు*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*ఫ్యామిలీ డాక్ట‌ర్‌ వైద్య విధానంతో అసంక్ర‌మిత వ్యాధుల‌కు చెక్‌*

*ఎన్‌హెచ్ ఎం బ‌డ్జెట్‌లో 5 శాతం అసంక్ర‌మిత వ్యాధుల చికిత్సకి కేటాయించాలి*

*కేంద్ర మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ‌ను ప్ర‌త్యేకంగా కలిసి వివ‌రించిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

అమరావతి (ప్రజా అమరావతి);

అవ‌య‌వ‌మార్పిడి, అవ‌య‌వ‌ దానాల‌కు సంబంధించి మ‌న దేశంలో నూత‌న విధానాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర స‌మాఖ్య 15వ కాన్ఫ‌రెన్స్‌ను కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్థ్య చింత‌న్ శివిర్ పేరుతో నిర్వ‌హిస్తోంది. రెండో రోజు శ‌నివారంనాడు నిర్వహించిన కార్య‌క్ర‌మంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప‌లు అంశాల‌పై మాట్లాడారు. మ‌న దేశంలో అవ‌య‌వాలు అవ‌స‌రం ఉన్న వ్య‌క్తులు, అందుబాటులో ఉన్న అవ‌య‌వాల నిష్ప‌త్తిలో చాలా తేడా ఉంటోంద‌న్నారు. 100 మందికి ఏవైనా అవ‌య‌వాల అవ‌స‌రం ఉంటే.. కేవ‌లం ఒక్కరికి మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాయ‌న్నారు. దీనివ‌ల్ల అవ‌య‌వ‌దానం, అవ‌య‌వ‌మార్పిడి విష‌యాల్లో అక్ర‌మాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్ని నివారించాల్సిన అవ‌స‌రం ఎంతయినా ఉంద‌న్నారు. అందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం నూతన పాల‌సీని తీసుకురావాల‌న్నారు. దీనివ‌ల్ల పేద రోగుల‌కు మేలు చేకూరుతుంద‌ని తెలిపారు.

*కేంద్ర మంత్రికి ప్ర‌త్యేక విన‌తి*

కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండ‌వీయ‌ను క‌లిసి ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. ఆ మేర‌కు విన‌తిప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. అసంక్ర‌మిత వ్యాధుల విష‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. త‌మ‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం 2021 అక్టోబ‌ర్‌లో అసంక్ర‌మిత వ్యాధుల‌పై స్క్రీనింగ్ ప్రారంభించింద‌ని తెలిపారు.  బీపీ, షుగ‌ర్ రోగుల‌పై ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం వ‌ల్ల సాధ్య‌మ‌వుతోంద‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో ఈ ఫ్యామిలీ డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే క్యాన్స‌ర్‌, గుండె వ్యాధుల‌కు ముంద‌స్తు ప‌రీక్ష‌లు కూడా చేయ‌బోతున్నామ‌న్నారు.  క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బుల చికిత్స‌కు త‌మ ప్ర‌భుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఏకంగా 600కుపైగా క్యాన్స‌ర్ చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చామ‌న్నారు. అందుకోసం ఏటా రూ.600 కోట్లకు పైగా ఖ‌ర్చుచేస్తున్నామ‌న్నారు. కాన్య‌ర్ చికిత్స‌ను బ‌లోపేతం చేసేందుకు  రూ.350 కోట్లతో  టీచింగ్ ఆస్ప‌త్రుల్లో అత్యాధునిక ప‌రిక‌రాలు, వ‌స‌తులతో పాటు స్టేట్ క్యాన్స‌ర్ సెంట‌ర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఇది పెనుభార‌మైనప్పటికీ భరించేందుకు సిద్ధంగా వుందనన్నారు . కేంద్ర ప్ర‌భుత్వం కూడా స‌హ‌కారం అందిస్తే రాష్ట్ర ప్ర‌భుత్వాల ల‌క్ష్యాలు సులువుగా నెర‌వేర‌తాయ‌న్నారు. గుండె జ‌బ్బుల‌కు ఇప్పుడు అందుతున్న వైద్యాన్ని కూడా మ‌రింత బ‌లోపేతం చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.  ఎన్ హెచ్ ఎం కింద ఇస్తున్న నిధుల్లో 5 శాతం ఈ జ‌బ్బుల చికిత్స కోసం కేటాయిస్తే ప్ర‌జ‌ల‌కు మేలు చేకూరుతుంద‌ని కేంద్ర మంత్రికి విన్నవించారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా చేప‌డుతున్న వైద్య ఆరోగ్య ప‌థ‌కాలు, విధానాల‌కు కూడా ఎన్ హెచ్ ఎం నుంచి అద‌నంగా నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ కేంద్ర మంత్రులు మ‌న్సూక్ మాండవీయ‌, ఎస్పీసింగ్ భాగేలా, 15 రాష్ట్రాల వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ‌బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జె.నివాస్ తదిత‌రులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image