హథీరాం జీ మఠం మహంతుపై చర్యలకు ధార్మిక పరిషత్ నిర్ణయం.

 *హథీరాం జీ మఠం మహంతుపై చర్యలకు ధార్మిక పరిషత్ నిర్ణయం*


*•ఈనెల 6 న అన్నవరం  సత్యనారాయణ  స్వామి దేవాలయం నుండి ధర్మ ప్రచారం ప్రారంభం*

*•శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1917 దేవాలయాల నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం*

*•రొటేషన్ పై ఉద్యోగుల విధుల కేటాయింపు సత్ఫలితాలను ఇస్తున్నాయి,ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు*

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, ఆగస్టు 1 (ప్రజా అమరావతి): తిరుపతి హథీరాం జీ మఠానికి గతంలో మహంతుగా నున్న  అర్జున్ దాస్ అనే వ్యక్తి పలు అక్రమాలకు పాల్పడినట్లు  త్రి సభ్య కమిటీ పలు ఆధారాలతో ధృవీకరించిన నేపధ్యంలో ఆ మహంతుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.  మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు దేవాదాయ, ధర్మాదాయ శాఖ  కార్యకలాపాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి హథీరాం జీ మఠానికి  గతంలో మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడినట్లు, మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. అయితే ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేవని అర్జున్ దాస్ గతం లో కోర్టుకెళ్లారన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారానే ఆ మహంతుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం  ఉపక్రమించిందన్నారు.  రాష్ట్ర ధార్మిక పరిషత్ ద్వారా హథీరాం జీ మఠం మహంత్ గా ఉన్న అర్జున్ దాస్ ను సస్పెండ్  చేసి ఆ మఠానికి ఒక ఫిట్ పర్సన్ని నియమించడం జరిగిందన్నారు. అయితే అర్జున్ దాస్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించడం జరిగిందన్నారు. ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి 16 ఆరోపణలను దృవీకరిస్తూ   ఆధారాలతో నివేదికను అందజేయడం జరిగిందన్నారు.  ఈ సమగ్ర నివేదికను రాష్ట్ర ధార్మిక పరిషత్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తదుపరి   అర్జున్ దాస్ పై చర్యలు తీసుకునేందుకు నిర్ణయించండం జరిగిందని ఆయన తెలిపారు. 


*సనాతన హిందూ ధర్మ ప్రచారం  ఈ నెల 6 న అన్నవరం నుండి ప్రారంభం……*

                                                                                                                                                                                        సనాతన హిందూ  ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.  ఈ ధర్మ ప్రచార పరిషత్ ఈ నెల 6 న అన్నవరం సత్యనారాయణ   స్వామి దేవాలయం నుండి  సనాతన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్నవరం చుట్టుప్రక్కల నున్న దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవచనాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు  ఆయన తెలిపారు. స్థానిక కళాకారులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి వారికి పారితోషకాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. 


*శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1,917 దేవాలయాల నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తాం……*

                                                                                                                                                                                          శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ చేపట్టిన 1,917 దేవాలయాలను ఈ ఏడాది నవంబరు మాసానికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. టి.టి.డి. సహకారంతో చేపట్టిన ఈ దేవాలయాల నిర్మాణాల్లో ఇప్పటికే 200 దేవాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, 912 వివిద దశల్లో ఉన్నాయని మిగిలిన 798 దేవాలయాల శంకుస్థాపనలను త్వరలో చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కాక మరో 870 దేవాలయాల మంజూరీకై ప్రతిపాదలను టి.టి.డి.కి పంపడం జరిగిందని, త్వరలోనే ఆ దేవాలయాలను అన్నింటినీ మంజూరు చేస్తామని టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారన్నారు.  ప్రత్యేకించి ఏజన్సీతో పాటు పలు వెనుక బడిన ప్రాంతాల్లో ఈ దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు స్థానిక సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకు అడ్వాన్సుగా రూ.2.00 లక్షల చొప్పున నిధులను విడుదల చేయడమైందన్నారు. అదే విధంగా ప్రతి 30 దేవాలయాలకు ఒక సహాయక ఇంజనీరును నియమించి నిర్మాణ పనులను వేగవంతం చేయడం జరిగిందన్నారు. నిర్మాణ పనులను ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షిస్తూ ఆ ప్రగతిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పోర్టల్ డాష్ బోర్డులో ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు .


*రొటేషన్ పై ఉద్యోగుల విధుల కేటాయింపు సత్ఫలితాలను  ఇస్తున్నాయి, ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు……*


భక్తులతో మర్యాదగా ప్రవర్తిసూ వారికి మంచి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల్లో పనిచేసే డిప్యూటీ ఇ.ఓ., అసిస్టెంట్ ఇ.ఓ., సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు ఒకే సెక్షన్ లో పనిచేయ కుండా మూడు మాసాలకు ఒక సారి రొటేషన్ పద్దతిపై మార్చే విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.  ఈ విదానం వల్ల ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి కూడా పోయిందని, వారంతా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.  ఈ రొటేషన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడం జరుగుచున్నదని, ఆ వివరాలు అన్ని డాష్ బోర్డులో ఉంచడం జరుగుచున్నదన్నారు. 



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image