రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, బీమా...రెండూ ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ.



రాయదుర్గం (ప్రజా అమరావతి);


*బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం లో నారా చంద్రబాబు నాయుడు పర్యటన*

*రాయదుర్గం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*


నేను చాలా సార్లు రాయదుర్గం వచ్చాను. కానీ నేటి జన స్పందన చూసి చెపుతున్నా వైసీపీ పని అయిపోయింది. 

• ఈ  రోజు రాయదుర్గంలో చెపుతున్నా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి భూ స్థాపితం చేద్దాం.

నా కోసం కాదు...ఈ రాష్ట్రం కోసం..నా యువత కోసం...నా రైతుల కోసం...నా కష్టజీవుల కోసం...నా ఆడబిడ్డల కోసం...జగన్ ను ఓడించాలి అని కోరుతున్నా

జగన్ ఒక చాన్స్ అంటే నమ్మారు..ముద్దులకు మురిసిపోయారు...తలమీద చే యిపెడితే కరిగిపోయారు...ఒక సారి చాన్స్ అంటే మోసపోయారు.

రాయదుర్గం తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం.కొంచెం నీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఉన్నారు.

పంటలు దెబ్బతింటే రైతును ఆదుకోవడానికి ఇన్ పుట్ సబ్సిడీ, వాతావారణ ఆధారిత బీమాను తెచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, బీమా...రెండూ ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ

నేడు బీమా లేదు...ఇన్ పుట్ సబ్సిడీ లేదు. కొండ నాలుకకు మందేస్తే ...ఉన్న నాలుకపోయినట్లు అయ్యింది. నేనే రైతు వాటా కూడా కట్టి బీమా చేస్తాను అన్నాడు. దాన్ని నాశనం చేశాడు.

మళ్లీ పాత పంట బీమా పథకం తెస్తాను. రైతాంగాన్ని ఆదుకుంటాను.

రాయలసీమ ఎడారి కాకుండా....భగీరథ ప్రయత్నంతో గోదావరి నీళ్లు తేవాలని ప్రయత్నం చేశాను.

నాడు ఇరిగేషన్ పై 68 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ కేవలం 22 వేల కోట్లు ఖర్చు పెట్టాడు.

జగన్ రామలసీమకు మొత్తం కలిపి 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇతను రాయలసీమ ద్రోహి కాదా?

బైరివానితిప్ప ప్రాజెక్టు కు నాడు రూ. 970 కోట్లు కేటాయించాను. పనులు చేశాను. సిఎం 4 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చెయ్యలేదు.

గొల్లపల్లి పూర్తి చేసి ఈ జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చాను. కియా పరిశ్రమతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి.

చెర్లోపల్లి, ఉంతకల్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు మనమేం చేశాo.

టీడీపీ వచ్చి ఉంటే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. రాయల సీమలో 102 ప్రాజెక్టులను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడు. ఒక్క అనంతపురంలోనే 32 ప్రాజెక్టులను రద్దు చేశాడు.

ఈ ఏడాది వర్షాలు పడలేదు.....పంటలు ఎండిపోయాయి....34 లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోయింది.

కరువు నివారణకు కనీస చర్యలు తీసుకోలేదు. నాడు మనం 90 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఆ పథకాలు అన్నీ నిలిపివేశారు.

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు. రైతును వెంటిలేటర్ పై పెట్టారు.

అనంతపూర్ లో 2022లో రూ.1500 కోట్ల పంటనష్టం వస్తే...కనీసం 10శాతం కూడా రైతులకు పరిహారం చెల్లించలేదు.

రాష్ట్రంలో రైతాంగం నేడు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఎక్కువ అప్పుల్లో ఉన్న రైతులు మన రాష్ట్ర రైతులు

కరెంట్ చార్జీలు పెంచి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. కరెంట్ చార్జీలు బరించే పరిస్థితిలో ప్రజలు లేరు

కరెంట్ చార్జీలు 8 సార్లు  పెంచారు.

రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు రూ.800 వస్తుంది. రూ.1000 వస్తుంది.

ఒక్కో ఇంటిపై కరెంట్ బిల్లు భారం రూ. 8 వేల నుంచి 30 వేల వరకు పడుతుంది.

కరెంట్ సరఫరాలోను ఇబ్బందులు...కోతలు.

2019లో 22 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంటేదాన్ని అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం

నాడు కరెంట్ చార్జీలు పెంచలేదు...కరెంట్ కోతలు లేవు. మరి ఇప్పుడు కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు.

నేడు ఇండస్ట్రీకి కూడా పవర్ హాలిడే ఇచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో...ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు

అందుకే చెపుతున్నా...మీ భవిష్యత్ కు గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చార్జీలు పెంచను అని హామీ ఇస్తున్నా

కరెంట్ ఇవ్వడం లేదు కానీ...రైతు మెడకు సిఎం ఉరితాడు వేస్తున్నాడు

తెలంగాణలో రైతుల మోటార్లకుమీటర్లు పెట్టడం లేదు. మరి జగన్ ఎందుకు మీటర్లు పెడుతున్నాడు

వచ్చే ఎన్నికల్లో జగన్ తాట తీసి కారం రాద్దాం.

నేడు చెపుతున్నా...జగన్ గెలిచే అవకాశం లేదు. ఒక వేళ ఏదైనా తప్పు చేస్తే మీ పై కరెంట్ భారం లక్ష అవుతుంది.

రాష్ట్రంలో మద్యం రేట్లు ఎందుకు పెరిగాయి. మద్యపాన నిషేధం అన్నాడు....మద్యం రేట్లు పెంచాడు. నాణ్యత లేని మద్యం తెచ్చాడు

బళ్లారిలో ఉన్న బ్రాండ్లు ఇక్కడ లేవు....తెలంగాణ లో ఉన్న మద్యం బ్రాండ్లు ఇక్కడ లేవు

మద్యం షాపుల్లో బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు. జగన్ షాపుల్లో మాత్రం డబ్బులే కట్టాలి. ఆన్ లైన్ లో తీసుకోరు

ఒకప్పుడు రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 అయ్యింది. అంటే రూ.140 దోపిడీ. రెండు క్వార్టర్లు దాటితే నెలకు 8 వేలు......ఏడాదికి లక్ష రూపాయలు గుంజుతాడు. అలాంటి జలగ ఈ జగన్

ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదు. టీడీపీ కి మాత్రమే ఉంది.

మీ దగ్గర మద్యం పేరుతో గుంజిన లక్ష వెనక్కి ఇచ్చి...అప్పుడు ఓటు అడగమని చెప్పండి

మద్య పాన నిషేదం చేసి...అప్పుడు ఓటు అడగమని చెప్పండి

రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేదు. ఇసుక దోపిడీపై నాగేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే అతనిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు.

అతని ఫిర్యాదు ఆధారంగా ఎన్జిటి ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానికి సమాధానం చెప్పని జగన్....లిక్కర్ బాటిల్స్ ఉన్నాయని దొంగ కేసు పెట్టి నాగేంద్రను అరెస్టు చేశారు.

ఎవరైనా సమాజం కోసం పోరాడితే తప్పుడు కేసులు...అరెస్టులు. ఇదేం న్యాయం

ఇక్కడ యువత ఉన్నారు...మీకు ఉద్యోగాలు వచ్చాయా...డిఎస్సి వేశారా....

మరి చదువుకున్న పిల్లలు ఏం చేయాలి. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి

మద్యం, పెట్రోల్, నిత్యావసర వస్తువలు ధరలు అన్నీ పొరుగు రాష్ట్రం కంటే పెరిగాయి. కందిపప్పు నేడు రూ,200 అయ్యింది. నాడు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి భారం కాకుండా చేశాం

జగన్ ఇచ్చింది 10 రూపాయాలు దోచింది...100 రూపాయలు

అందుకే మీకు నమ్మకం ఇవ్వడానికి వచ్చాను....అదే బాబు ష్యూరిటీ...భవిష్యత్ కు గ్యారెంటీ

జగన్ మూడురాజధానులు అంటూ మూడుముక్కల ఆట ఆడుతున్నాడు

మన రాజధాని ఏది అని జగన్ ను అడగండి. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సైకో

రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మీ పిల్లల భవిష్యత్ ను కాపాడే బాధ్యత నాది. ఒక్క చాన్స్ తోనే చాలా నష్టపోయాము. 

అందుకు మహిళల కోసం మహాశక్తి పథకం తెచ్చాను. నాడు అందరికీ అమ్మఒడి అన్నాడు....కానీ కోతలు పెట్టాడు. మనం వచ్చిన తరువాత ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15000 ఇస్తాను.

ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తా.దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తాం. అవసరం అయితే అదనంగా మరో సిలిండర్ ఉచితంగా ఇస్తా

మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

ప్రతి ఆడబిడ్డను శక్తి వంతమైన మహిళగా మారుస్తా. జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ వచ్చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.

దారితప్పిన యువతను గాడిన పెడతాను. యువతకు యువగళం నిరుద్యోగ బృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా.

నా బలం..నా సైన్యం ఈ యువతే. వారి కోసం పాటుపడతా. 

ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారు.

ముందుగా ఎన్నికలు వస్తే జగన్ ను ముందే వదిలించుకోవచ్చు. ఎన్నికలకు 6 నెలలు సమయం ఉంది. మూడు నెలల్లో కూడా ఎన్నికలు రావచ్చు. వస్తే మంచిదే.

రైతులకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20,000 ఇస్తాను.

అనంతపురంలో 14 సీట్లకు 14 సీట్లు గెలవబోతున్నాం.

బిసిలు, పేదలు ఉండే జిల్లా. బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తా. బిసిల రుణం తీర్చుకునే బాధ్యత నాది.

తాగడానికి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తాం

పి4 విధానంతో రాష్ట్రంలో పేదరికం లేని సమాజం నిర్మిస్తాం.

నియోజవకర్గంలో భైరివాని తిప్ప ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే టీడీపీ గెలవాలి. ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

ఉంతకల్లు ప్రాజెక్టు పనులు కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లలేదు.

ఉంతకల్లు రిజర్వాయరుపై 2021 జులై 8న రాయదుర్గంలో సిఎం జగన్ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరును నిర్మిస్తామని హామీ ఇస్తున్నాను.

గుమ్మఘట్ట మండలం గోనబావిలో రూ.24 కోట్లతో బీసీ బాలిక ఆశ్రమ పాఠశాల నిర్మాణం మొదలు పెడితే దానిని పూర్తి చేయలేకపోయారు. 

రాయదుర్గంలో బాలికల జూనియర్ కళాశాలకు స్థలం ఇచ్చి నిథులు మంజూరు చేస్తే ఈ చేతకాని ఎమ్మెల్యే నేటికీ భవనాలు సమకూర్చలేదు. 

డి.హీరేహాల్ లో ప్రభుత్వం జూనియర్ కళాశాల మంజూరైనా భవన నిర్మాణం పూర్తి చేయలేదు. 

మాల్యం బ్రాంచ్ కాలవ, ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి అయ్యి ఉంటే దాదాపు 37 వేల ఎకరాలకు సాగునీరు అందేది. వాటినీ అటకెక్కించారు.

వేదవతి, హగరి నదుల్లో నాలుగు చోట్ల సబ్ సర్ఫేస్, సర్ఫేస్ డ్యాంలు తలపెట్టాం. భూపసముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనులకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రాజేంద్రసింగ్ తో భూమిపూజ కూడా చేయించాం. వాటినీ ఆపేశారు.

ఎమ్మెల్యే కాపు పెద్ద కేటుగాడు. అతని అవినీతి బయటపెడతా.

వేదవతి,హగరి నది నుండి పక్క రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్నారు. ఇటునుంచి ఇసుక అక్రమంగా తరలించి...అటునుంచి అక్రమ మద్యం తెస్తున్నారు. 

చిన్న చిన్న క్వారీల నుంచి చిన్న పరిశ్రల వరకు ఏది నడపాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.

48 క్వారీలను బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. ఇది వీళ్ల అబ్బ సొమ్మా

బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఎమ్మెల్యే అక్రమంగా క్వారీ పనులు చేస్తున్నాడు. దీంతో మైనింగ్ అధికారులు రూ.రెండు కోట్ల పెనాల్టీ విధించారు. దాన్ని చివరికి సెట్ చేసుకున్నారు.

ఓబులాపురం దోపిడీకి కాపు కాసే వ్యక్తి ఈ కాపు రామచంద్రారెడ్డి.

గనులు, క్వారీల అక్రమాల్లో ఎమ్మెల్యేకు విశేష అనుభవం ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, గుమస్తాల పేరిట క్వారీ లీజులు పొంది అక్రమ మైనింగ్ సాగిస్తున్నాడు. ఇతరుల క్వారీలకు అనుమతులు రాకుండా ఒక్కడే మాఫియా నడుపుతున్నాడు.

ఇసుక, అక్రమ మైనింగ్, గ్రానైట్ కంపెనీ లు, లే అవుట్ యజమానుల నుంచి కమిషన్ లు, సెటిల్మెంట్లు, వసూళ్ల ద్వారా ఎమ్మెల్యే బాగా బలిసిపోయాడు. 

చివరికి హెచ్ఎల్ సీ కాలువకు మోటార్లు వేసుకున్న రైతుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడ్డ గనుడు ఈ ఎమ్మెల్యే. రైతుల నుంచి కూడా రూ. 5 వేలు రూ.7 వేలు వసూలు చేశాడు.

నేను చిత్తూరు జిల్లా పర్యటనకు వెళితే నాపై దాడి చేసి....నాపైనే హత్యాయత్నం కేసుపెట్టారు.

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన చల్లా బాబుతో తప్పుడు అంగీకార పత్రం పై సంతకం చేయాలని పట్టుపట్టారు.

అంగళ్లలో నా సూచనల మేరకు దాడి చేశాం అని రాసి సంతకం పెట్టమన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image