ఓటర్ల తుది జాబిత-2024 పై సంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీమ్ కోర్టు.

 *ఓటర్ల తుది జాబిత-2024 పై సంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీమ్ కోర్టు*

*•సంవిధాన్ బచావో ట్రస్టు పిల్ పై  తుది తీర్పువెల్లడించిన సుప్రీమ్ కోర్టు*


అమరావతి, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి):  దేశంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబిత – 2024  రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ప్రక్రియ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ  సంవిధాన్ బచావో ట్రస్టు  సుప్రీమ్ కోర్టు లో ధాఖలు చేసిన రిట్ పిటిషన్ పై  ఈ నెల 12 వ తేదీ సోమవారం నాడు సుప్రీమ్ కోర్టు తీర్పును వెల్లడించింది. డూప్లికేట్ మరియు ఘోస్టు ఓటర్లను తొలగించడానికి  భారత ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోలేదని నిందించే అవకాశం  ఏ మాత్రము లేదని సుప్రీమ్ కోర్టు భావించింది. ఈ విషయంలో తదుపరి ఆదేశాలు అవసరం లేదని గౌరవ న్యాయ స్థానం భావిస్తూ ఈ పిల్ పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీమ్ కోర్టు తుది తీర్పులో పేర్కొన్నదని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో  తెలియజేసింది. 

 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించే విధంగా భారత ఎన్నికల సంఘాన్ని అదేశించాలని కోరుతూ సంవిధాన్ బచావో ట్రస్టు సుప్రీమ్ కోర్టులో  పిల్  (రిట్ పిటిషన్ నెం.1288/2023) ను ధాఖలు చేసింది.  ఈ కేసు విషయంలో భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 మరియు ఓటర్ల నమోదు నియమాలు, నిబంధనలు -1960 ప్రకారము స్వచ్ఛమైన సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అనుసరిస్తున్న  ప్రక్రియను మరియు తీసుకుంటున్న సమగ్ర చర్యలను సుప్రీం కోర్టుకు వివరించింది. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను  రూపొందించండంలో భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వ్యూహాత్మమైన చర్యలు, ప్రక్రియకు భారత ఉన్నత న్యాయ స్థానం సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంవిధాన్ బచావో ట్రస్టు  పిల్  (రిట్ పిటిషన్ నెం.1288/2023) ను సోమవారం నాడు కొట్టేసింది.


Comments