రాష్ట్రంలో పారదర్మకం గా ఉచిత ఇసుక అమలు.

 


*రాష్ట్రంలో పారదర్మకం గా ఉచిత ఇసుక అమలు*


*నాణ్యమైన మద్యం రూ..99కే*

*ఇసుక, మద్యం లో దోపీడి జరిగిందని జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చున్నారు*

*-మంత్రి కొల్లు రవీంద్ర*


జగన్మోహన్ రెడ్డి ఇసుక, మద్యం లో దోపీడి జరిగిందని మొసలి కన్నీరు కార్చున్నారని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం తెలగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలొకి రాగానే జూలై 8వ తేదీన ఉచిత ఇసుక అమలు చేశాం. గత ఐదేళ్లు అక్రమ ఇసుక ద్వారా రూ. 1000కోట్లు జగన్ రెడ్డి దోచుకున్నారు.. నేడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉచిత ఇసుక రాష్ట్ర ప్రజలకు అందించడం జరుగుతోంది. గతంలో ఎద్దుల బండికి మాత్రమే ఉచిత ఇసుక రవాణా ఉండేది..మా ప్రభుత్వంలో ట్రాక్టర్ ఉచిత ఇసుకకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ వేసుకొని ఉచిత ఇసుకను తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకెళ్లమని ఆయన అన్నారు. గత ఐదేళ్లు మైనింగ్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించారు. భవన నిర్మాణ కార్మికులను సర్వ నాశనం చేశారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి ఆదాయం రాలేదుని మండిపడ్దారు.. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడం వలన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసీపీ నాయకులకు రూ. 100 కోట్లు జరిమానా విధించడం నిజం కాదా ? వైసీపీ తొత్తులుగా పని చేసిన కలెక్టర్లను కోర్టులకు వెళ్లేలా చేసి సంజాయిషీ చేప్పుకునేలా జగన్ రెడ్డి చేశారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా ? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ద్వారా సెమీ మెకానిజం పెట్టి కోట్ల రూపాయల ఇసుకను దోపిడీ చేసింది నిజం కాదా ? వైసీపీ చేసిన అనైతిక విధానాల వలన 130 రీచ్ లు సీజ్ చేశారు. దీంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వైసీపీ చేసిన అరాచకాలు వలన ఎన్జీటీ కఠిన తరమైన నిర్ణయాలు తీసుకుంది.  దీంతో అన్నీ రీచ్ లు తెరవలేకపోతున్నాము. 80 లక్షల టన్నుల ఇసుక ఉందని వైసీపీ అసత్యాలు చెబుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 35 లక్షల టన్నుల మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. ఆన్లైన్ పోర్టల్ లో ఏపీ శ్యాండ్ మేనేజ్మెంట్ సిస్టం పెట్టి గ్రామ సచివాలయాల ద్వారా కూడా ఇసుకను అందిస్తున్నాము. 8 జిల్లాల్లో డీసెటిటేషన్ పాయింట్లను ప్రారంభించాము. సామాన్యుడికి ఉచిత ఇసుక వెళ్లాలి. కొన్ని జిల్లాల్లో అసలు రీచ్ లు లేవు. సీనరేజ్ ద్వారా వచ్చే 264 కోట్ల ఆదాయాన్నికూడా రద్దు చేశాము. కేవలం ఆపరేషన్ ఛార్జీలు మాత్రమే తీసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి మేము సమాధానం అవసరం లేదు. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాము. రాబోయే కాలంలో ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగుతాయి. అతి తక్కువ రేటుకే ఇసుకను అందిస్తాము. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఉచిత ఇసుకను అందిస్తాము


రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అవ్వడానికి కారణం జగన్ రెడ్డి కాదా..? మీ ధనదాహానికి ప్రజల రక్తాన్ని పీల్చీ డబ్బులు దోచుకుంది వాస్తవం కాదా..? ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం నూతన పాలసీని పారదర్శకంగా అమలు చేస్తున్నాం.  మీ స్వార్ధం కోసం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా?  మద్యం తయారీ నుండి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా? జగన్ రెడ్డి విషపూరిత మద్యం వల్ల రాష్ట్రంలో లక్షలు మందిపైగా ప్రాణాలు కొల్పాయారు..40లక్షల మంది అనారోగ్యపాలైయ్యారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు 930 కేసులు నమోదు అయిన మాట వాస్తవంకాదా..? 856 కల్తీ మద్యం కేసులు వైసీపీ హాయాంలో నమోదు అయిన మాట వాస్తవం కాదా..? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాన్ డ్యూటీ పేయిడ్ 20కేసులు నమోదు.. మద్యం షాపుల్లో ఆర్థిక అవకతవకలపై 45కేసులు.. రూ.2.63కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా..? 2019-23 మద్య 321శాతం అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. గతంలో తెలంగాణకు రూ.4వేలకోట్లు వ్యత్యాసం ఉంటే వైసీపీ పాలనలో 43వేలకోట్లు వ్యత్యాసం ఉంది. గంజాయి, డ్రగ్స్ ఆదాయం పెంచుకోవడానికి బీర్లు రేట్లు పెంచిన..మీరు నీతి కబుర్లు చెబుతున్నారా.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ. ఎన్. ఏ పరీక్షలు  6దశల నుంచి 13దశలకు పెంచాం. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా నూతన పాలసీ తీసుకొచ్చాం. రూ.99 కే క్వార్టర్ మద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరల్ని నిర్ణయించబోతున్నాం. కల్లు గీత కార్మికులకు కేటాయించిన 340 షాపులకు త్వరలోనే దరఖాస్తులు పిలుస్తామన్నారు. గతంలో మద్యం ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతప్రభుత్వంలో మద్యంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశాం. మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి రూ. 1900కోట్లు దోచుకున్నారు. అక్టోంబర్ 1నుండి 3,396 ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలవడం జరిగింది..మద్యం షాపులకు మంచి స్పందన వచ్చింది..80,882 దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797 కోట్లు అదాయం వచ్చింది. 16వ తేదీ నుంచి పార్టీలకతీతంగా ఈ ప్రక్రియ చేపట్టాం. టెండర్ కమిటీ విధానం వచ్చిన తరువాత రేట్లన్నీ రీస్ట్రక్చర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. బడులకు, దేవాలయాలకు  100 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకుండా చూసుకుంటాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని కూడా బలోపేతం చేస్తాం. డిఎడిక్షన్ సెంటర్స్ రిహ్యాబిటేషన్ ద్వారా అవైర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేపడతాం. జగన్ ఆదాయం పోయింది కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాటరీల్లో ఎక్కడా తప్పు జరగలేదు. వైసీపీ నాయకులకు కూడా షాపులు వచ్చాయి. చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాం. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు వలన ప్రజలు నష్టపోయారు. వైసీపీ హయాంలో మద్యం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వంపై బురదజల్లితే మీరే నష్టపోతారని మంత్రి మండిపడ్డారు.

Comments