అనంతపురం (ప్రజాఅమరావతి); జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం* *13 జిల్లాల్లో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలు ఏర్పాటు చేస్తాం.* *అనంతలో మచ్చా రామలింగారెడ్డి ని సన్మానించిన జర్నలిస్టులు.* *50లక్షల జర్నలిస్ట్ హెల్త్ భీమాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.* *మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులుజర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీడిమాండ్. ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన మా మచ్చా రామలింగారెడ్డి అన్ననీ అనంతపురం జిల్లా జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అనంతపురం నగరంలోని R&B అతిథి గృహం నందు నగర జర్నలిస్టులు గజమాలతో సన్మానించారు. మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం పై రాజీలేని పోరాటం చేస్తామని జర్నలిస్టులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని అన్నారు రాష్ట్రంలోని 13 జిల్లాలో జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కమిటీలను ఏర్పాటు చేస్తామని యూనియన్లకు అతీతంగా సొసైటీ పనిచేస్తుంది అని మచ్చా రామలింగారెడ్డి అన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కి అండగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతామని అన్ని జిల్లాల్లో త్వరలో పర్యటిస్తానని ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ ని కూడా జర్నలిస్టులు సన్మానించారు. అనంతపురం జిల్లాకు చెందిన మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కావడం జర్నలిస్టులందరికీ గర్వకారణమని జిల్లాలోని జర్నలిస్టులందరికీ స్ఫూర్తి ఇస్తుందని జర్నలిస్టు మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనం పత్రిక బ్యూరో ఇంచార్జ్ వెంకటేష్ సొసైటీ ప్రధాన కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్ సీనియర్ జర్నలిస్టులు దామోదర్ రెడ్డి, మంజునాథ్, సాక్షి సతీష్, నగేష్, రంగనాథ్ ఆంధ్రజ్యోతి హరికృష్ణ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్టూడియో N బాలు, స్నేహ TV జానీ, 19న్యూస్ జీవన్, షాకీర్ ఉపేంద్ర మీడియా ఎంప్లాయిస్ ఆది, సతీష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments