శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరీ నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య రోజున అనగా ది.21-06-2020 ఆదివారము నాడు మృగశిర, ఆరుద్ర నక్షత్రములలో మిధున రాశి, యందు రాహుగ్రస్త సూర్యగ్రహణము( గ్రహణం స్పర్శ కాలము: ఉ.10.25 నిం.లు , గ్రహణ మధ్య కాలము: మ.12.08 నిం.లు , గ్రహణ మోక్షకాలము : మ.01.54 నిం.లు ) ఏర్పడుచున్న సందర్భముగా ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక కమిటీ సభ్యుల వారి సూచన మేరకు ఆగమ శాస్త్ర ప్రకారము గా దేవాలయము ఈరోజు అనగా ది.20-06-2020, శనివారము రోజు సాయంత్రం శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారి సమక్షంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుబట్ల శివ ప్రసాద శర్మ గారి పర్యవేక్షణలో దేవాలయ కవాట బంధనము చేయబడినది. తిరిగి గ్రహణానంతరం ది.21-06-2020 ఆదివారము మ.2 - 30 గం.లకు ఆలయము శుద్ధి పరచి, ప్రధానాలయ మరియు ఉపాలయముల దేవతామూర్తులకు స్నపనాది కార్యక్రమములు నిర్వర్తింపజేసి శ్రీ అమ్మవారికి పంచహారతులు నిర్వహించిన అనంతరం సా.07 గం.లకు ఆలయము యధావిధిగా మూసివేయబడి, మరుసటి రోజు అనగా ది.22-06-2020 ఉదయం 06 గం.లకు యధావిధిగా భక్తులను అమ్మవారి దర్శనము నకు అనుమతించబడునని, ఈ సందర్భముగా ది.21-06-2020 ఆదివారము రోజున జరుగు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనదని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపారు.


Comments