23–06–2020 అమరావతి సీఎం శ్రీ వైయస్ జగన్. స్పందన కార్యక్రమం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు. అమరావతి: ముఖ్యమైన అంశాలపై సీఎం రివ్యూ. అంశాల వారీగా సీఎం ఏమన్నారంటే.... ఇళ్ల పట్టాలు: జూలై 8న ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం: సీఎం 29 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నాం: ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్లపట్టాల ఇస్తున్నాం: అతి పెద్ద కార్యక్రమం ఇది: జూలై 8 ఎంతో దూరంలో లేదు : అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం ఇది: భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలి: జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని సమీక్షించిన సీఎం శ్రీ వైయస్.జగన్ నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి: సీఎం 80 శాతం అయ్యిందని, 85 శాతం అయ్యిందని, 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదు: నూటికి నూరు శాతం కచ్చితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదే పదే గుర్తుంచుకోవాలి: ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి: ఇళ్లపట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి: కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాక గ్రామాల్లో నేను పర్యటిస్తాను: ఇంటి పట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తకూడదు : పూర్తి పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలి: సంతృప్త స్థాయిలో ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలి: సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తాను: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా రావాలి: నాకు ఓటు వేయని వారికి కూడా ఇళ్లపట్టా ఇవ్వాలి: పెన్షన్ కార్డు 10 రోజులు, రేషన్ కార్డు కూడా 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలి: ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే: ఎక్కడా వివక్ష లేకుండా, సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందాలి: ఇసుక : వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేశామన్న అధికారులు రోజువారీ అవసరాలను తీరుస్తూనే.. వర్షాకాలంలో అవసరాల కోసం ఆ ఇసుకను నిల్వ చేశామన్న అధికారులు నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వ చేయాలన్న సీఎం వచ్చే రెండు వారాలు మాత్రమే మనకు ఇసుక అందుబాటులో ఉంటుంది: సీఎం ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి.. రీచ్లు మునిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కావాల్సిన ఇసుకను ఇప్పటికే నిల్వ చేసుకోవాలి: శ్రీకాకుళం జిల్లాలో 20 వేల టన్నులు, తూర్పు గోదావరిలో 60 వేల టన్నులు, పశ్చిమ గోదావరిలో 35 వేల టన్నులు, కృష్ణా జిల్లాలో 50 వేల టన్నులు, గుంటూరులో 40 వేల టన్నుల ఇసుక ప్రతి రోజూ ఉత్పత్తి చేయాలి: – ఏమీ చేయకపోయినా.. ఏదో రకంగా వేలెత్తి చూపిస్తారు: – వర్షాలు కురిసేలోగా ఇసుకను నిల్వ చేయాలి: – ఈ నిల్వ చేసిన ఇసుకే మనకు వచ్చే కాలంలో వినియోగపడుతుంది: – థర్డ్ ఆర్డర్ నదుల నుంచి, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో పాటు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని తెలిపిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ – ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్న ద్వివేదీ ఉపాధి హామీ పనులు : – ఉపాధి హామీ కింద భారీగా పనులు కల్పించండి. – కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. – గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల మీద పూర్తిగా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. – వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగించండి. – వెంటనే పనులు మొదలు పెడతారు. – నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదు. – ఇవన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంగన్వాడీ కేంద్రాలు: – 55 వేల అంగన్వాడీలను నాడు – నేడు కింద అభివృద్ఢి చేస్తున్నాం – భవనాలు ఉన్న చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం. – సొంతంగా భవనాలు లేని చోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. – వీటి కోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్కు బదిలీ చేయండి. జగనన్న పచ్చతోరణం: పచ్చదనం పెంపునకు జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యం నాడు – నేడులో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తున్నందువల్ల అక్కడ, ఇంకా ఖాళీ స్థలాలు, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కల నాటే కార్యక్రమం. అలాగే ఇళ్లపట్టాలు ఇవ్వనున్న లే అవుట్స్లో కూడా బాగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశం. ప్రతి ఇళ్ల పట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కులు ఇవ్వాలన్న సీఎం వార్డు క్లినిక్స్: – పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్. వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరిట నిర్మాణం. – 2 కి.మీ పరిధిలో, కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లే దూరంలో వార్డు క్లినిక్స్ నిర్మాణం. – దీని కోసం స్థలాలను గుర్తించాలి. పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం: – ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి ఉంది: – ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి: – ఫర్నిచర్, ఫ్యాన్లు.. అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి.. పనులు పూర్తి కాకపోతే.. ఇబ్బందికరంగా ఉంటుంది: – స్కూళ్లు తెరిచేలోగా నాడు – నేడు కింద పనులు పూర్తి కావాలి: – కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి: – అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది: – నాడు – నేడుకు నిధుల కొరత లేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు : – ఆగస్టు 9న ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ. – గిరిజనులకు జీవనాధారం చూపించాలి. – వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందే అవకాశం ఉంటాయి వ్యవసాయం: – ఆర్బీకేల కోసమే ఒక జాయింట్ కలెక్టర్ను పెట్టాం – ఆర్బీకేల్లో ఉన్న ప్రతి సమస్యా మన సమస్యే అని గుర్తు పెట్టుకోవాలి – 10,641 ఆర్బేకేలు, 65 ఆర్బేకే హబ్స్ను ఏర్పాటు చేయటం జరిగింది. – నాణ్యమైన ఎరువుల కోసం, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్ ఇవ్వగానే 48 గంటల్లోగా అవి డెలివరీ కావాలి. – ఇ–క్రాపింగ్చాలా ముఖ్యం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. – పంటలు కొనుగోలు చేయాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా, బీమా ఇవ్వాలన్నా, పంట రుణాలు ఇవ్వాలన్నా.. ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. – హార్టికల్చర్, ఫిషరీస్ కూడా ఇ– క్రాపింగ్లో నమోదు కావాలి. – గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన, 2018 రబీ పంటల బీమాకు సంబంధించిన రూ.596 కోట్ల బీమా డబ్బును జూన్ 26న చెల్లించబోతున్నాం. – 5 లక్షలకు పైగా రైతులకు దీని వల్ల మేలు జరుగుతుంది. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులకు మేలు కలుగుతుంది. ఆరోగ్యం: – క్యూ ఆర్ కోడ్తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. దాదాపు 22 లక్షల కార్డులు ఇంకా పంపిణీ కాలేదు. ఇవి పూర్తిగా పంపిణీ చేయాలి. – కొత్తగా కట్టే మెడికల్ కాలేజీలకు ప్రతి చోటా 50 ఎకరాలు పొజిషన్లోకి తీసుకునే కార్యక్రమాన్ని వెంటనే సంబంధిత శాఖకు అప్పగించాలి. – 16 మెడికల్ కాలేజీలను కొత్తగా కట్టబోతున్నాం. – రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకూ ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. – కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నాం. – ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలని ఆలోచన చేస్తున్నాం, ప్రతి జిల్లాలో కూడా టీచింగ్ మెడికల్ కాలేజీ ఉండేలా చూస్తున్నాం. – కావాల్సిన భూమిని గుర్తించి, వెంటనే ఆ భూమిని అప్పగించాలి. కోవిడ్ : – వ్యాక్సిన్ కనుక్కునేంత వరకూ కోవిడ్తో కలిసి బతకాల్సిన పరిస్థితి. – ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల మీద మనం ఫోకస్ పెట్టాలి. – స్టిగ్మా తొలగించాలి.. ఆ మేరకు చైతన్యం, అవగాహనం కలిగించాలి. – అప్పుడే మరణాలు తగ్గుతాయి. – కోవిడ్ సోకిందనే అనుమానం రాగానే వెంటనే మందులు తీసుకుంటే, చికిత్స తీసుకుంటే.. తగ్గిపోతుంది. – భయం, ఆందోళనతో చివరి వరకూ చెప్పకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. చాలా చాలా కష్టం అవుతుంది. – ఆ పరిస్థితి రాక ముందే... జాగ్రత్తలు తీసుకోవాలి. – కోవిడ్ సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఎస్ఓపీపై అవగాహన కల్పించాలి: – ప్రతి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో కోవిడ్ సోకిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై ఒక హోర్డింగ్ పెట్టండి. – ఎవరెవర్ని సంప్రదించాలన్న దానిపై ప్రొసీజర్ను వివరించేలా హోర్డింగ్ పెట్టండి. – ప్రతి గడప వద్దకూ వెళ్లి.. అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. – కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. – జిల్లాల్లో ఆస్పత్రుల్లో సదుపాయాలపై దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. – 85 శాతం కేసులు ఇంట్లోనే ఉండి నయం అయిపోతాయి. వారికి మందులు ఇవ్వాలి. ఆ యంత్రాంగం కరెక్టుగా ఉందా లేదో పరిశీలించాలి. – ఆస్పత్రులకు వచ్చే 15 శాతం మందికి ఇచ్చే సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా, లేవా చూడండి. – ప్రతి జిల్లాకు కనీసం 1500 బెడ్లు ఉండేలా చూసుకోవాలి. అక్కడ సదుపాయాలు బాగా ఉండేలా చూసుకోండి. – 108, 104 వాహనాలను 1060 ఒకేసారి ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త వాహనాలు. – ప్రతి మండలానికీ ఒక 104 వాహనం ఉంటుంది. ఈ వెహికల్ ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వారికి స్క్రీనింగ్ చేస్తున్నాం. – ఇంటింటికీ సర్వే చేసి, ప్రతి ఇంట్లో ఉన్న ఆరోగ్య వివరాలను క్యూఆర్ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులోకి డేటా పంపించాలి. – మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యా«ధులున్న 40 ఏళ్లకు పైబడ్డ వారిని, 60 ఏళ్లకు పైబడ్డ వారికి పరీక్షలు చేయండి. – డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులను వారికి అందిస్తారు. సాగునీటి ప్రాజెక్టులు – వంశధార, తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. – ఈ సీజన్లో వెలిగొండ అందుబాటులోకి వస్తుంది. దీని కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. – గండికోట, చిత్రావతిలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే.. ఈ పునరావాస పనులు పూర్తి కావాలి. – పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పునరావాస పనులు చేపట్టాలి. 41.5 ఎత్తు వరకూ కూడా ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చురుగ్గా తీసుకోవాలి. – పునారావాస కాలనీల్లో కూడా అన్ని చర్యలూ తీసుకోవాలి.
Popular posts
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
• GUDIBANDI SUDHAKAR REDDY
Year End Review 2024; Ministry of Road Transport and Highways.
• GUDIBANDI SUDHAKAR REDDY
పశు గణన భవిష్యత్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
• GUDIBANDI SUDHAKAR REDDY
Three Action Plan teams formed for Semiconductor; Critical Minerals with a focus on batteries; and Chemicals to facilitate supply chain resilience.
• GUDIBANDI SUDHAKAR REDDY
Computing and technological development is a core building block for India to become a developed country by 2047: Shri Ashwini Vaishnaw.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment