*సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం శ్రీ వైయస్.జగన్* *ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష* *అక్టోబరులో అవుకు టన్నెల్–2, వెలిగొండ మొదటి టన్నెల్, నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా సాగు నీరు* *వంశధార నాగావళి లింక్ ద్వారా డిసెంబరులో నీటి విడుదల* *నవంబరులో పోలవరం గేట్ల బిగింపునకు ప్రయత్నాలు* *వర్షాకాలంలోనూ ప్రణాళికా బద్ధంగా అంతరాయం లేకుండా పోలవరం పనులకు సీఎం ఆదేశం* *గత ఏడాది గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా పునరావాస పనులకు ఆదేశం* అమరావతి (ప్రజాఅమరావతి): – సాగునీటి ప్రాజెక్టులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష – క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, సీఎస్ నీలం సాహ్ని, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు హాజరు – ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్–2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, టన్నెల్–1 పనులు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టులో ఫేజ్ –2లో స్టేజ్–2 పనులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష – అవుకు టన్నెల్ –2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్న అధికారులు. అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేస్తామన్న అధికారులు. – వెలిగొండ టన్నెల్–1లో ఇంకా తవ్వాల్సింది 700 మీటర్లు ఉందన్న అధికారులు. నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామన్న అధికారులు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్–1 ద్వారా నీటిని విడుదల చేస్తామన్న అధికారులు. – నల్లమలసాగర్ పూర్తయ్యిందని, ఆర్ అండ్ ఆర్కూ అన్ని రకాల అనుమతులు వచ్చాయని, నల్లమలసాగర్ నుంచి ఈస్ట్రన్ మెయిన్ కెనాల్కు వెళ్లే 180 మీటర్ల టన్నెల్ పనులు కూడా మరో 3 నెలల్లో పూర్తవుతాయని వివరించిన అధికారులు. – తీగలేరు కెనాల్కు వెళ్లే 600 మీటర్ల టన్నెల్ పనులు కూడా పూర్తవుతున్నాయని వెల్లడించిన అధికారులు. నాలుగు నెలల్లో టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేస్తామన్న అధికారులు. *నెల్లూరు బ్యారేజీ:* – పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, అందువల్ల రెండు నెలల్లో సివిల్ వర్క్స్ పూర్తి చేస్తామన్న అధికారులు. అక్టోబరు చివరి నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడి. – సంగం బ్యారేజీ పనులు కూడా అక్టోబరు చివరి నాటికి పూర్తవుతాయన్న అధికారులు. *వంశధార నాగావళి లింక్:* – వంశధార– నాగావళి లింక్ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు. – వంశధార ఫేజ్ –2లో స్టేజ్ –2లో మిగిలిపోయిన పనులు కూడా వేగంగా సేఫ్ స్టేజ్ వరకు పూర్తి చేసి 8 టీఎంసీల నీరు నింపుతామన్న అధికారులు. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన పనులు కూడా పూర్తవుతాయన్న అధికారులు. – నేరడి బ్యారేజీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులతో చర్చించిన సీఎం *పోలవరం ప్రాజెక్టు:* – పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని వివరించిన అధికారులు – ఆగస్టు తప్ప మిగిలిన సమయాల్లో స్పిల్వే పనులు నడిచేలా ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు. – రేడియల్ గేట్స్ ఫ్రాబ్రికేషన్ చేసుకుని నవంబరు నుంచి అమర్చుతామన్న అధికారులు. – మిగిలిన వాటి పనులు కూడా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు. – ఏప్రిల్లో 3 వేల మంది కూలీలు ఉంటే.. కోవిడ్ కారణంగా 900 మంది మాత్రమే పనుల్లో ఉన్నారని, మళ్లీ వారందర్నీ పిలిపిస్తున్నామని, ప్రస్తుతం 2 వేల మంది కూలీలు పని చేస్తున్నారన్న అధికారులు. – స్పిల్వేలో 52 పిల్లర్లు గతంలో సరాసరిన 28 మీటర్లు ఎత్తున ఉంటే.. ప్రస్తుతం 47.44 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాయని సీఎంకు వెల్లడించిన అధికారులు. – వర్షపు నీరు వచ్చే సమయంలో కూడా చేసుకోదగ్గ పనులు చేసుకోవాలన్న సీఎం, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు. – స్పిల్ వే పూర్తయిన తర్వాత గేట్లను నవంబరు నుంచి బిగించాల్సి ఉంటుంది కాబట్టి, ఆలోగా గేట్ల ఫాబ్రికేషన్ అయ్యేలా చూడాలి. ప్లాన్–బి కూడా పెట్టుకోవాలని ఆదేశించిన సీఎం. నవంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. – పనులు ప్రణాళికా బద్ధంగా సాగకపోతే.. షెడ్యూల్కు అంతరాయం ఏర్పడుతుందన్న సీఎం. – గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. – 41.5 మీటర్ల ఎత్తు వరకూ ప్రస్తుతం ముంపు ప్రమాదం ఉన్న వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్న సీఎం. – చెల్లింపులు పోగా, పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం మిగిలిపోయిన భూసేకరణ, పునరావాస పనులు వెంటనే పూర్తి చేయాలన్న సీఎం.
Popular posts
ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ ఐసిఎఐ!.
• GUDIBANDI SUDHAKAR REDDY

Andhra Pradesh Accelerates Green Building & Net-Zero Goals with Government Incentives at IGBC Green Andhra Summit 2025.
• GUDIBANDI SUDHAKAR REDDY

అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న ముఖ్యమంత్రి.
• GUDIBANDI SUDHAKAR REDDY
పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు…
• GUDIBANDI SUDHAKAR REDDY

అవయవ దానం పై అవగాహన సదస్సు.
• GUDIBANDI SUDHAKAR REDDY

Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment