*డీజీపీ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ* అమరావతి: డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వెనుకబడినవర్గాలకు చెందిన నేతలపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్ నమోదు చేయడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు.. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని తెలిపారు. అలాగే సోషల్ మీడియా, సొంత మీడియా ద్వారా విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని వెల్లడించారు. డా.సుధాకర్, డా. అనితారాణిపై పెట్టిన కేసులను కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
Popular posts
తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో..
• GUDIBANDI SUDHAKAR REDDY
శిశిరం చిత్రం అతి త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల.
• GUDIBANDI SUDHAKAR REDDY
National Internet Exchange of India unveils new office at World Trade Centre, New Delhi along with its new initiatives.
• GUDIBANDI SUDHAKAR REDDY
India's participation in IFTM Top Resa 2024 at Paris expected to boost Inbound Tourism.
• GUDIBANDI SUDHAKAR REDDY
కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ఆర్కే.
• GUDIBANDI SUDHAKAR REDDY
Publisher Information
Contact
prajaamaravathi@gmail.com
9347530295
D.NO. 16-4, A, KOLLIPARA VILLAGE AND MANDAL, DIST. GUNTUR -522304, ANDHRA PRADESH
About
Praja Amaravati is a monthly magazine
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
Post a Comment