శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ: ఈ రోజు తేది. 21-11-2020 న మహామండపము 6 వ ఫ్లోర్ నందు పరిమిత సిబ్బందితో సామాజిక దూరం మరియు ఇతర కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును గౌరవనీయులైన పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి ఎన్.అంబిక గారు, దేవాదాయ శాఖ సిబ్బంది మరియు SPF సిబ్బంది పర్యవేక్షించారు.
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.1,77,66,026/-
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 415 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 6100 గ్రాములు
లెక్కించిన హుండీ లు : 37
గడచిన రోజులు : 21 రోజులు
భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించారు.
శ్రీ అమ్మవారి సేవలో...
కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment