తాడేపల్లి (ప్రజా అమరావతి);
*మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ పధకం అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు (ఆసరా, అభివృద్ది), ఉన్నతాధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్*
*హజరైన మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీ శంకరనారాయణ, శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ గిరిజాశంకర్, డైరెక్టర్ చిన్నతాతయ్య, ఇతర ఉన్నతాధికారులు*
*జిల్లాల నుంచి వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం శ్రీ నారాయణస్వామి, హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత, మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధరాజు, శ్రీ పేర్ని నాని, శ్రీమతి తానేటి వనిత*
*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమావేశంలో ఏమన్నారంటే...*
– 10,929 గ్రామ సచివాలయాలు, 10,404 రైతు భరోసా కేంద్రాలు, 8,585 వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్, 13,392 స్కూళ్ళకు ప్రహరీ గోడల నిర్మాణం, 8,052 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
– 2021 మార్చి 31లోపు అన్నీ పూర్తి చేయాలి, దీనిపై ప్రత్యేక డ్రైవ్ అవసరం ఉంది
– సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు, స్పందన సమీక్షలలో కూడా పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని తగిన ఆదేశాలు జారీచేస్తున్నారు
– నాలుగు నెలల్లో నాలుగు వేల కోట్లు ఖర్చు చేయాలి కానీ దానికి తగిన స్ధాయిలో ఖర్చు జరగడం లేదు
– ప్రతీ వారం సమీక్షలు జరిపి తక్కువ పురోగతిలో ఎవరు ఉన్నారో వారు ప్రత్యేక దృష్టి పెట్టాలి
– లో – ప్రొగ్రెస్ ఉన్న జిల్లాలలో అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేయాలి
– కలెక్టర్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిర్ణీత గడువులోగా టార్గెట్ పూర్తి చేయాలి
– సీఎంగారి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు అందరూ పనిచేయాలి
– ఏ ఒక్క అధికారి కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు
– కొన్ని జిల్లాలలో అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారు, మిగిలిన జిల్లాల అధికారులు కూడా అదే స్ధాయిలో పనిచేయాలి
– ట్రైబల్ ఏరియాలలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి
– ఏ నియోజకవర్గాల్లో సకాలంలో పనులు పూర్తవుతాయో ఆ నియోజకవర్గాలకు అదనంగా మరో రూ. 5 కోట్ల విలువైన పనులు ఇవ్వాలని సీఎంగారు సూచించారు. కాబట్టి ఈ మేరకు అధికారులు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి
– జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రులు, అధికారులు
– పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలి
– అధికారులు సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.
addComments
Post a Comment