రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:
*పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత*
*రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలి*
*కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి*
*అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం*
*భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి*
*ఆ విమానాశ్రయం నుంచి విశాఖ సిటీకి సత్వరమే చేరుకునేలా వేగంగా బీచ్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావాలి*
*పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీఆపీఆర్) వెంటనే సిద్ధం చేయాలి*
*పైమూడు పనులకు సంక్రాంతిలో శంకుస్థానకు అధికారులు సన్నద్ధం కావాలి*
*అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆదేశాలు*
అమరావతి:(ప్రజా అమరావతి);
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల్ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్ జెవిఎన్ సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ ఎండీ కె.రవీన్కుమార్రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఈడీ పి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
*సమీక్షలో సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..:*
మూడు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్, భోగాపురం ఎయిర్పోర్టు
ఆ ఎయిర్పోర్టు నుంచి విశాఖ సిటీకి త్వరగా చేరుకునేలా బీచ్ రోడ్డు నిర్మాణం
విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణం
పోలవరం నుంచి విశాఖకు పైపు లైను ద్వారా తాగు నీటి సరఫరా ప్రాధాన్యతా అంశాలన్న సీఎం
పోలవరం నుంచి విశాఖకు తాగునీటి పైపులైన్పై త్వరగా డీపీఆర్ తెప్పించుకోవాలన్న సీఎం
*మూడు పోర్టులు–పనులు:*
కాగా, రామాయపట్నం పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు
రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరిలో మొదలుపెడతామన్న అధికారులు
మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వెల్లడి
భావనపాడు పోర్టుకు డిసెంబర్ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు
మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడి
మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వెల్లడి
మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి,
ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడి
మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేస్తామని వెల్లడి
*రెండున్నర ఏళ్లలో..*:
ఈ మూడు పోర్టుల పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లోని విశాఖపట్నం నోడ్లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును వివరించిన అధికారులు
*వాటిని పరిశీలించండి:*
రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశం
తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించ వచ్చని, ఇంకా కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయన్న సీఎం శ్రీ వైయస్ జగన్.
*శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్లో కార్యకలాపాలను వివరించిన అధికారులు*
ఎయిర్ కార్గో అవసరాన్ని వివరించిన అధికారులు
తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం
*ఓర్వకల్ నోడ్లో కార్యకలాపాలను వివరించిన అధికారులు*
పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్ వాటర్ను వినియోగించేలా చూడాలన్న సీఎం
లీటరు నీరు 4 పైసలకు మాత్రమే వస్తుందన్న సీఎం
దీని వల్ల తాగునీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం
ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక వాడల్లో మురుగునీటి పారిశుద్ధ కేంద్రాల (ఎస్పీటీ) ఏర్పాటు తప్పనిసరని సీఎం ఆదేశాలు
పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలని సీఎం ఆదేశం
addComments
Post a Comment