అమరావతి (ప్రజా అమరావతి);
మన బడి నాడు – నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్ ఎస్పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
ఈ సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...
మన బడి నాడు – నేడు
మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలి – సీఎం
స్కూళ్ళు మంచి కలర్ఫుల్గా మంచి డిజైన్లతో ఉండాలి – సీఎం
నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూల్స్ ఫొటోలు పరిశీలించిన సీఎం
స్కూళ్ళలో ఇంటీరియర్ కూడా బావుండాలి
రెండో దశ నాడు – నేడు పనులపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సెకండ్ ఫేజ్లో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్లు సౌకర్యవంతంగా ఉండాలి
పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు : సీఎం
నాణ్యతకు పెద్దపీట వేయాలి:
పనుల్లో నాణ్యత లేకపోతే సీరియస్గా తీసుకోవాలి:
మనసా వాచా కర్మణ మనం కమిటెడ్గా పనిచేయాలి
అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం
టేబుల్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్ హైట్ కూడా చూసుకోవాలి
పక్కా భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు.
ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు:
ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా భవనాలు కట్టించాలి:
నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలి:
రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి సీఎం ఆదేశాలు
పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత.
స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం సమీక్ష
ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామన్న అధికారులు
మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు
పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
విద్యార్ధుల హాజరు.
విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియ నడుస్తోందని అధికారులు వెల్లడి
వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు
మార్చి 15కల్లా పూర్తిచేస్తామన్న అధికారులు
విద్యాకానుకపై సీఎం.
విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలని సీఎం ఆదేశం
విద్యాకానుకలో కిట్లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలని సీఎం ఆదేశం
క్వాలిటీ కూడా బాగుండాలని సీఎం ఆదేశాలు
అలాగే పాఠ్యపుస్తకాలు కూడా క్వాలిటీగా ఉండాలన్న సీఎం
ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలని సీఎం ఆదేశం
విద్యాకానుకలో ఏది చూసినా... కూడా క్వాలిటీ ఉండాలని సీఎం ఆదేశం
ఎక్కడా కూడా రాజీపడొద్దన్న సీఎం
టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలన్న సీఎం
అమ్మ ఒడి కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్టాప్లు క్వాలిటీ, సర్వీస్ ముఖ్యం
*సీబీఎస్ఈ విధానంపై సీఎం*
2021– 22 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్ఈ విధానం
తర్వాత తరగతులుకు ఒక్కో ఏడాదీ అమలు
2024 విద్యాసంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు సీబీఎస్ఈ విధానంలోకి
*అంగన్వాడీ టీచర్లకు శిక్షణ*
అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న సీఎం
చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై శిక్షణ
అలాగే టీచర్లకు కూడా శిక్షణ కొనసాగాలన్న సీఎం
ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్నదానిపై ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం
పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాలద్వారా అప్గ్రేడ్ అయ్యారో పరిశీలించి, మరింతగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలన్న సీఎం.
addComments
Post a Comment