ప్రణాళికా శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



ప్రణాళికా శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో జె. విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.


అమరావతి (ప్రజా అమరావతి);


*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...*


*నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి*


గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలి: సీఎం

గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఈబాధ్యతలు అప్పగించాలి: సీఎం

మండలస్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్‌ వైజ్‌ చేస్తారు :సీఎం

ఆర్బీకేల్లో ఉన్న డేటాను కూడా స్వీకరించాలి:

ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ– క్రాపింగ్‌ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలి: 

దీనివల్ల ఇ– క్రాపింగ్‌ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టగలుగుతాం:

గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్‌సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలి:

దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుంది:

సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయన్న అధికారులు

ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం ఆదేశం

ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతోకూడా కలిసి పనిచేయాలి: సీఎం


డేటాను కేవలం సేకరించడమే కాదు, ఆ డేటా ద్వారా మనం తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలి:

వివిధ కార్యక్రమాల్లో మనం ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం, లోపాలేమిటో గుర్తించాలి:

వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి:


*వలంటీర్లకు సత్కారం*


వలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలి: సీఎం

వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలి:

సేవారత్న, సేవామిత్ర...పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వలంటీర్లను సత్కరించాలి:

Comments