అమరావతి (ప్రజా అమరావతి);
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్లాన్పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష.
ఉద్ధృతంగా వ్యాక్సినేషన్.
నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్స్.
ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి అర్భన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్.
రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్.
లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, అధికారులకు సీఎం ఆదేశాలు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది:
ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టిపెట్టేవాళ్లం:
కాని అలా జరగలేదు:
మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి?:
దీనివల్ల వ్యాక్సినేషన్కు అడ్డంకులు వచ్చే పరిస్థితి:
అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉంది:
ఇలాంటి సందిగ్థత వాతావరణం మధ్య అంతా ఉన్నాం:
ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది:
చాలా ఆవేదన కలుగుతోంది: సీఎం శ్రీ వైయస్.జగన్
ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలి:
వ్యాక్సినేషన్ను ఉద్ధృతంచేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలి:
*అర్బన్ ఏరియాలలో స్ధానిక ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన సీఎం*
వీలైనంత త్వరగా విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావాలి:
వ్యాక్సినేషన్ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలి: సీఎం
గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి:
ప్రజల్లో చైతన్యానికి మరింత ప్రచారం నిర్వహించాలి:
అందరూ వేసుకుంటున్నారా? లేదా? అనేది అక్కడికక్కడే పరిశీలన చేయాలి:
వారికి అవగాహన కల్పించి అప్పుడే వ్యాక్సిన్ ఇచ్చేలా చేయాలి:
పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాలి:
104లతో అనుసంధానంగా ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోతున్నారా? లేదా చూసుకోవాలన్న సీఎం
మండలానికి 2 పీహెచ్సీలు ఉండాలి, ఒక్కో పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి:
అలాగే ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు ఉండాలి:
ఒక్కో వాహనంలో ఒక్కో డాక్టరు ఉండాలి:
ఈరకంగా మండలానికి 6గురు వైద్యులు ప్రతి మండలంలో ఉండాలి:
నెలకు మూడు సార్లు ప్రతిగ్రామాన్నీ వైద్యుడు సందర్శించాలి:
వైద్యుల నియామకంలో ఎలాంటి సంకోచాలు వద్దని సీఎం ఆదేశం
అవసరాలకు తగిన విధంగా డాక్టర్ల నియమాకాలు చేయాలని సీఎం ఆదేశం
దీనికి అవసరమైన నిధుల జారీలో ఎలాంటి అలక్ష్యం వద్దని ఆర్థిక శాఖ ఆధికారులకు సీఎం ఆదేశం
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సిన్ పెండింగులో ఉందన్న అధికారులు
అలాగే 60 ఏళ్లకు పైబడి, మరియు 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 59.08 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్న అధికారులు
దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడ్డ వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం నిర్ణయం ప్రకటించిందన్న అధికారులు
మొత్తంగా కోటిమందికిపైగా వ్యాక్సినేషన్ను శరవేగంగా ఇవ్వడానికి అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం
దీనికోసం సన్నాహకంగా ప్రతి మండలంలో మండలంలో రోజుకు 2 గ్రామాల చొప్పున, వారానికి 8 గ్రామాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను చేయాలన్న సీఎం
ఈ ప్రక్రియలో వస్తున్న లోపాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేయవచ్చన్న సీఎం
వారానికి 25 లక్షల చొప్పున నాలుగు వారాల్లో 1 కోటిమందికి వ్యాక్సిన్ ఇచ్చేలా సిద్ధం కావాలన్న సీఎం
కోవిడ్నిర్ధారణ పరీక్షలన్నీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే చేయాలన్న సీఎం
కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలను అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగాలన్న సీఎం
104 నంబర్కు కాల్ చేస్తే వైద్యసేవలు సమర్థవంతంగా అందేలా చూడాలన్న సీఎం
ప్రస్తుతం 5వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా అదనపు బెడ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు
ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయన్న దానిపై దృష్టిపెట్టామన్న అధికారులు
మిగతావాటితో పోలిస్తే పాఠశాలల్లో కేసులు సంఖ్య చాలా స్వల్పమన్న అధికారులు
ఏదైనా స్కూళ్లో కేసులు వస్తే... 3 రోజలుపాటు నిలిపేసి అందరికీ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి నడిపేందుకు అనుమతిస్తున్నామన్న అధికారులు
సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎం ముఖ్యసలహాదారు నీలంసాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు.
addComments
Post a Comment