శ్రీశైలంలోఘనంగా ముగిసిన పాగాలంకరణ, కళ్యాణోత్సవం..శివరాత్రి వేడుకలు.

  కర్నూలు/ శ్రీశైలం (ప్రజా అమరావతి);


శ్రీశైలంలోఘనంగా ముగిసిన పాగాలంకరణ, కళ్యాణోత్సవం..శివరాత్రి వేడుకలు.



శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న దాదాపు 85,000 ల మంది భక్తులు.


శ్రీశైలం లో ఈ రోజు మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల రథోత్సవం.


ఈ నెల 14 న ముగియనున్న శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు.


శ్రీశైలం శివరాత్రి వేడుకల్లో సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను, శీఘ్ర  దర్శనం ఏర్పాట్లను, భద్రతా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లను గురువారం ఉదయం నుండి ఈ తెల్లవారుజాము 4 గంటల వరకు మేల్కొని స్వయానా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, పలు శాఖల జిల్లా అధికారులు, ఈ.ఓ రామారావు, దేవస్థానం అధికారులు, పోలీసు అధికారులు.


శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మహా శివరాత్రిపర్వదినాన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్,  స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,  దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్, పంచాయతీ రాజ్ & రూరల్ దేవలప్మెంట్  కమీషనర్ గిరిజా శంకర్,  జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు గురువారం రాత్రి దర్శించుకున్నారు.


గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.


అనంతరం, శ్రీశైలం దేవస్థానం లో మహా శివరాత్రి పర్వదినాన విశేష కార్యక్రమలుగా నిర్వహించిన నంది వాహన సేవ, స్వామి వారి ఆలయ శిఖరానికి, నవనందుల  పాగాలంకారణ, లింగోద్భవ దర్శనం, అనంతరం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల కల్యాణోత్సవంలో మంత్రి అవంతి శ్రీనివాస్, లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, ఈ.ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.


దాదాపు 85,000 ల మంది భక్తులు శివరాత్రి నాడు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని ఈ.ఓ.రామారావు తెలిపారు.


ఈ రోజు మధ్యాహ్నం శ్రీశైలంలో రథోత్సవం...ఈ నెల 14 న ముగియనున్న శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు.


ఈ రోజు మధ్యాహ్నం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియం లో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు పై ఇచ్చే శిక్షణా కార్యక్రమం...అనంతరం, కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాట్లును పర్యవేక్షణ చేసి, ఈ సాయంత్రం మునిసిపల్ కమీషనర్లు, జిల్లా నోడల్ కమిటీల అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష చేయనున్న  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.



Comments