కోవిడ్‌పై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.



కోవిడ్‌పై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.



వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.


వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత అధికారులతో సీఎం సమీక్షా సమావేశం.


అమరావతి (ప్రజా అమరావతి):


వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ భంగకరంగా మారింది: సీఎం వైయస్‌.జగన్‌

అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయింది:

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది:

మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేది:

కానీ అలా జరగలేదు, జాప్యం జరుగుతూ వస్తోంది:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది:

ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు:

లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం... ఇవన్నీకూడా కష్టం అవుతాయి:

మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలి:

ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలి:

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో మిగిలిపోయిన ఆ 6 రోజుల ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరాలి:

ప్రజారోగ్యం దృష్ట్యా, దేశవ్యాప్తంగా కేసులుపెరుగుతున్న రీత్యా ఇది అత్యంత అవసరం:

ఎన్నికలు ముగిస్తే... వ్యాక్సినేషన్‌పై యంత్రాంగం తదేక దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది: సీఎం

వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలన్న సీఎం

సంబంధిత సచివాలయం పరిధిలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయడంపై దృష్టిపెట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం

45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలి అధికారులకు సీఎం ఆదేశం 

వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్‌రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలి:

వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని అధికారులను ఆదేశించిన  సీఎం 

అలాగే కోవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచాలన్న సీఎం 

కోవిడ్‌ పరీక్షలన్నీకూడా పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం


హాజరైన డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, పలువురు ఉన్నతాధికారులు.

Comments