క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి.


దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థలో ఉంటాయి.


భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం

క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం.

ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ నిర్వహించనున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌వ్యవస్థ

ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ 

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అన్నవరం టెంపుల్‌కు 10,116లు ఇ–హుండీ ద్వారా సమర్పించిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా


దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్న సీఎం

దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి: సీఎం


ఈ కార్యక్రమంలో  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్‌ కమిషనర్‌ అర్జున రావు, యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండి అండ్‌ సిఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ జి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్‌ఎల్‌బిసి ఏజీఎం అండ్‌ కోఆర్డినేటర్‌ ఇ.రాజుబాబు, రీజనల్‌ హెడ్‌  వి రమేష్‌ తదితరులు హాజరు.

Comments