శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ.
తిరుపతి (ప్రజా అమరావతి): తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సాయంత్ర 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం జరిగింది.
*°మార్చి 4న ధ్వజారోహణం :*
మార్చి 4న గురువారం ఉదయం 7.34 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి రాత్రి 8 గంటల వరకు హంస వాహనం ఆస్థానం జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 8 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
° *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*
◆ తేదీ ◆ ఉదయం ◆సాయంత్రం
■04-03-2021(గురువారం)
ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
■05-03-2021(శుక్రవారం)
సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 06-03-2021(శనివారం)
భూత వాహనం సింహ వాహనం
■ 07-03-2021(ఆదివారం) మకర వాహనం శేష వాహనం
■ 08-03-2021(సోమవారం)
తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
■09-03-2021(మంగళవారం)
వ్యాఘ్ర వాహనం గజ వాహనం
■10-03-2021(బుధవారం)
కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
■11-03-2021(గురువారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
■12-03-2021(శుక్రవారం)
పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
■13-03-2021(శనివారం)
శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
ఆస్థానం, త్రిశూల స్నానం. ధ్వజావరోహణం.
addComments
Post a Comment