ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది
దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్
బనగానపల్లె మార్చి 26 (ప్రజా అమరావతి):-ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అన్నారు
శుక్రవారం బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి పర్యాటక శాఖ ఆర్ డి ఈశ్వరయ్య లతో కలిసి సందర్శించారు
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కొరకు ఆర్థిక శాఖ మంత్రి తో కలిసి ఈరోజు యాగంటి క్షేత్రాన్ని సందర్శించనున్నారు దేవాలయంలోని శిల్పకళా సంపదను కాపాడుట కొరకు శిథిల దశలో ఉండే శిల్పసంపద టెక్నాలజీ వినియోగించు గతంలో లాగానే నూతనంగా కనిపించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందన్నారు యాగంటి క్షేత్రం లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి దేవాలయ ప్రాంగణం లో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించారు చిన్నచిన్న దెబ్బతిన్న వాటిని గతంలో లాగే ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు అక్కడి కార్యనిర్వాహక అధికారులతో కలిసి ఏమైనా అభివృద్ధి కొరకు నిధులు అవసరం ఉన్నాయా అభివృద్ధి చేయాలంటే ఏమేమి కావాల్సి వస్తుంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు అవసరం ఉన్న వాటి ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నార
ఈ కర్యక్రమంలో యాగంటి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి డి ఆర్ కె.వి ప్రసాద్ బనగానపల్లి తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ దేవాలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి గుండం శేషి రెడ్డి రాష్ట్ర ఆర్కియాలాజికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment