తిరుమల, ఏప్రిల్ 19 (prajaamaravathi); ఏప్రిల్ 21న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఏప్రిల్ 22న శ్రీరామపట్టాభిషేకం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీన బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 22న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు . రాత్రి 7 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది . ఆ తరువాత రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు . ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. ఏప్రిల్ 22న గురువారం సాయంత్రం 5 గంటలకు వైభవోత్సవ మండపంలో సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహిస్తారు.
ఏప్రిల్ 21న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
addComments
Post a Comment