ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ మామిడిపండ్ల రైతులకు ప్రత్యేకంగా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు : 

 అమరావతి (prajaamaravathi). గత నెల శుభవార్తను నిజం చేసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ మామిడిపండ్ల రైతులకు ప్రత్యేకంగా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు :


పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *సత్వరమే స్పందించి మామిడి పండ్ల సీజన్ దృష్ట్యా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలును ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి* *ఆరేళ్ళ తర్వాత మళ్లీ పున:ప్రారంభం వెనుక మంత్రి మేకపాటి కృషికి ట్విట్టర్ వేదికగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు అభినందనలు* *ఏపీలోని వేలాది మంది రైతులకు , వ్యాపారులకు భారీ లబ్ది* *కృష్ణా జిల్లా నూజివీడు నుంచి నేరుగా ఢిల్లీలోని ఆదర్శనగర్ కి మామిడిపండ్ల ఎగుమతి* *వ్యాపారమాల ఎక్స్ ప్రెస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే ఉద్యానపంటలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలుగా మంత్రి మేకపాటి వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం* *భారతదేశంలోని మామిడిపండ్ల ఉత్పత్తిలో 22 శాతం వాటా , 12 లక్షల అమెరికా డాలర్ల విలువైన ఎగుమతుల భాగస్వామ్యం ఏపీదేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు గత నెల ఢిల్లీ పర్యటనలో వివరించిన మంత్రి మేకపాటి* *అధిక ఉత్పత్తి నేపథ్యంలో అరటిపండ్లు, టమోటా పండ్ల ఎగుమతులకు వీలుగా కిసాన్ రైళ్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి మేకపాటి* *గత మార్చి 18న ఢిల్లీ పర్యటనలో కేంద్ర పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి కిసాన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కేటాయించాలని వినతిపత్రం సమర్పించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *ఏప్రిల్ 12వ తేదీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైన తొలి కిసాన్ రైల్ లో నూజివీడు నుంచి ఢిల్లీకి 220 టన్నుల మామిడిపండ్ల రవాణా* *కేంద్ర ప్రభుత్వం స్పందనతో నిజమైన ఉగాది పండగొచ్చిందన్న మంత్రి మేకపాటి* *ఈ సందర్భంగా రాష్ట్ర రైతులకు, ప్రజలకు..రైతు ప్రభుత్వం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి.

Comments