శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (prajaamaravathi)
: ఈ రోజు ది.13-04-2021న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు స్వాగతం పలికారు. అనంతరం మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొన్నారు. అనంతరం వేదపండితులు వీరికి వేదాశీర్వచనము చేసి, ఉగాది పచ్చడి మరియు అమ్మవారి ప్రసాదములు అందజేశారు.
addComments
Post a Comment