నేటి నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం.
తిరుమల (ప్రజా అమరావతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 27వ తేదీ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 18వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.00 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.
addComments
Post a Comment