నాడు నేడు పనులు జూన్ 20నాటికి తప్పకుండా పూర్తి చేయాలి.

అమరావతి (ప్రజా అమరావతి);


 నాడు నేడు పనులు జూన్ 20నాటికి తప్పకుండా పూర్తి చేయాలి.


 *వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.*


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమం మొదటి విడత పనులు తప్పకుండా జూన్ 20వ తేదికి పూర్తి చేయాలని, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశామన్నారు. ఇంకా గడువు ఇచ్చే అవకాశాలు లేవని, రెండోవిడత పనులు ప్రారంభించాల్సి ఉందని మంత్రి సురేష్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈఎన్ సిలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


నాడు నేడు పనుల్లో భాగంగా ప్రహరీ ల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు. డెస్క్ లు, నీటి సరఫరా వస్తువులు పాఠశాలలకు చేర్చి 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావటం పనులు వేగవంతానికి ఉపయోగం అని ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్ రైటింగ్ పనులు కూడా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రెండవ విడత నాడు నేడు పనుల టెండర్ ల ప్రక్రియ పై అధికారులతో సమీక్షించారు. రెండో విడతలో సివిల్ పనులకు సంబందించిన వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


Comments