అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

 

అమరావతి (ప్రజా అమరావతి);


అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.



కేవలం రెండు వారాల వ్యవధిలో, రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో జర్మన్‌ హ్యంగర్‌ టెంపరరీ కోవిడ్‌ హాస్పిటల్‌.


ప్రతీ పేషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్‌ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు, మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బంది.


ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...


అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని అభినందిస్తూ...కోవిడ్‌ టైంలో, ఆక్సీజన్‌ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్‌ స్టీల్‌కు ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్‌ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్‌ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారు, పేరుపేరునా అందరికీ అభినందనలు.  అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. 


ఈ కార్యక్రమానికి క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments