అమరావతి (ప్రజా అమరావతి);
*పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*జాయింట్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేసిన సీఎం*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*దేశం మొత్తం మనవైపు చూస్తోంది*
– మీరు అంతా యువత, మంచి ప్రతిభ ఉన్నవారు: సీఎం
– మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో గతంలో ఎప్పుడూ కట్టలేదు:
– దేశం మొత్తం ఇప్పుడు మనవైపు చూస్తోంది
– 28.30 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం:
– 17వేల లే అవుట్స్లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం:
– కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి:
- దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు:
– అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారు:
– గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో అర్హులైనవారికి సామాజిక తనిఖీచేసి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నాం:
– పెన్షన్లు, ఇంటిపట్టాలు, రేషన్కార్డులు, ఆరోగ్య శ్రీ... రెగ్యులర్ గా సామాన్యజనంతో లింకైన అంశాలు ఇవి:
– లబ్ధిదారులకు ఇప్పటికే స్ధలం కేటాయింపు పూర్తైంది.
– నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలి:
– 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో ఆగే ప్రక్రియ కాదు, మిగిలిన 12.70 లక్షల ఇళ్లు కూడా పూర్తికావాలి
– అంతేకాదు అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలి:
– అవినీతి, పక్షపాతం లేకుండా, వివక్షతకు తావులేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలి:
– శాచ్యురేషన్ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలి:
– అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు:
– నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి వారికి ప్రయోజనాలు అందించాలి:
– ఎవరైనా మిగిలిపోతే... వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు వారికి అందాలి:
–వారి పేరుమీద కనీసం ఇంటి స్ధలం రిజిస్టర్ చేసినట్లవుతుంది
– ఇలా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లు కూడా ఇవ్వాలి:
– అందుకనే ప్రతి ఏటా కూడా ఇలా పట్టాలు అందుకున్నవారికి ఇళ్లు కట్టించాల్సిన అవసరం ఉంటుంది:
– పేదవాడి సొంతింటికలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం:
– ఇంటి స్ధలం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా కనీసం రూ.5 లక్షల రూపాయల ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతున్నాం
– దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం:
– అది కూడా మహిళల పేరుమీద ఇస్తున్నాం
– ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దు:
– అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి:
– వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలి:
*కాలనీల్లో మౌలిక సదుపాయాలూ కల్పించాలి*
– కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా అత్యంత ప్రాధాన్యతా అంశం:
– ఇళ్లస్థలాల రూపేణా, నిర్మాణం రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా సుమారు రూ.86వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం:
– మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు అవుతుంది:
– ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు :
– ప్రతి పనిలో కూడా పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి:
– నాణ్యత విషయలో రాజీ పడితే... ఇబ్బందులు వస్తాయి:
– మనం ఆ ఇళ్లలో ఉండాలనుకుంటే ఏం కావాలనుకుంటామో, అలా ఆలోచించాలి
– నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలి:
– ఆ కాలనీల్లో వాణిజ్య కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలి
– సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలి, అప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతాం
– పనిలో డూప్లికేషన్ ఉండకూడదు అని సీఎం శ్రీ వైయస్.జగన్ జాయింట్ కలెక్టర్లకు నిర్దేశించారు.
ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment