వైఎస్సార్ బీమా, చేయూత సమీక్షలో పాల్గొన్న జేసీ గంగాధర్ గౌడ్*

 *వైఎస్సార్ బీమా, చేయూత సమీక్షలో పాల్గొన్న జేసీ గంగాధర్ గౌడ్* 



అనంతపురము, జూన్ 16 (ప్రజా అమరావతి);


బుధవారం వై యస్ ఆర్ బీమా, చేయూత పథకాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, సీఈఓ సెర్ప్ రాజబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాలు నుంచి జేసీ గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డీపీఎం సత్యనారాయణ తదితరులు కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. 


వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ పోషకుడికి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనున్నామన్నారు. బీమా సౌకర్యానికి అర్హులు మరియు వారి నామినీల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరించాలన్నారు. 


బీమా హక్కు దారులతో పాటు నామినీల నుంచి కూడా బయోమెట్రిక్ వివరాల సేకరించడంలో ఇబ్బందులున్నాయని డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి విన్నవించారు. చాలా సందర్భాల్లో నామినీలు ఒక చోట, బీమా లబ్ది దారులు ఒక చోట ఉండటం వల్ల ఇద్దరి వివరాలు సేకరించడం సమస్యగా మారిందన్నారు. 


18 నుండి 50 సంవత్సరాలు ఉన్న వారు సాధారణ మరణం చెందితే లక్ష రూపాయలు, 18 నుండి 70 సంవత్సరాలు కలిగి ప్రమాద వశాత్తూ మరణిస్తే వారికి రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని రూపొందించిందని జేసీ గంగాధర్ గౌడ్ తెలిపారు. వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు పారదర్శకంగా సర్వే చేసి పది రోజుల్లోగా ఆన్లైన్ లో బీమా హక్కుదారులు, నామినీల వివరాలు నమోదు చేయాలన్నారు. జూలై ఒకటవ తేదీ నుండి అమలు కానున్న వైయస్సార్ చేయూత లో మిగిలిన వారి వివరాలను త్వరతగతిన నమోదు చేయాలని ఆదేశించారు.


Comments