రాష్ట్రవ్యాప్తంగా 1.19 కోట్ల కార్డుదారులకు వీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యం పంపిణీ పూర్తి



- రాష్ట్రవ్యాప్తంగా 1.19 కోట్ల కార్డుదారులకు వీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యం పంపిణీ పూర్తి 


- 81 శాతం కార్డులకు నిత్యావసరాలను అందించాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూలై 29 (prajaamaravathi): రాష్ట్రంలో ఒక కోటి 19 లక్షల 29 వేల 642 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 48 లక్షల 17 వేల 365 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 23 వేల 898 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 71 వేల 893 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేశామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 10 లక్షల 03 వేల 280 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 80 వేల 638 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 47 వేల 805 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల 17 వేల 854 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 19 వేల 700 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 47 వేల 245 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 63 వేల 677 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 49 వేల 358 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 78 వేల 952 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల 85 వేల 024 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లక్షల 99 వేల 230 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 16 వేల 325 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 27 వేల 338 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల 19 వేల 309 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 87 వేల 930 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 11 లక్షల 34 వేల 751 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 50 వేల 540 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 13 లక్షల 56 వేల 444 కార్డులకు, కృష్ణాజిల్లాలో మొత్తం 13 లక్షల 105 వేల 118 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 84 వేల 810 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 17 వేల 055 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 89 వేల 586 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 92 వేల 842 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 76 వేల 405 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసినట్టు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 79 శాతం, ప్రకాశం జిల్లాలో 78 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 79 శాతం, అనంతపూర్ జిల్లాలో 83 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 81 శాతం, చిత్తూరు జిల్లాలో 82 శాతం, గుంటూరు జిల్లాలో 76 శాతం, విజయనగరం జిల్లాలో 88 శాతం, విశాఖపట్నం జిల్లాలో 85 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 82 శాతం, కృష్ణాజిల్లాలో 75 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 84 శాతం, నెల్లూరు జిల్లాలో 76 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.

Comments