శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,
ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ మరియు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ స్వాగతం పలికారు. మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ మరియు శాసనసభ్యులు శ్రీ ఎం.వేణుగోపాల్ గారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ శ్రీఅమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment