పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

 


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*



అమరావతి (ప్రజా అమరావతి);

*గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఆర్భీకేలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావాలి*

*వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలి*

*పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకు పెద్దపీట*

*పల్లెలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు*

*వైయస్సార్‌ జలకళ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం*

*దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలి*

*అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం*

*చిన్న చిన్న నదులమీద ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు*

*కనీసం 3–4 అడుగుల నీరు నిల్వ ఉండేలా ఏర్పాటు*

*తద్వారా భూగర్భజలాలు బాగా పెరుగుతాయి : సీఎం*

*రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేపట్టాలి*

*వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూరక్ష పథకం అమలుకు పటిష్ట చర్యలు*

*మరింత సమర్ధవంతంగా అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ*

*పంచాయతీరాజ్, రెవెన్యూ, పురపాలకశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*

 

*ఉపాధి హామీ కార్యక్రమాలు– ఏడాది గడువు*

ఉపాధీ హామీ కింద చేపట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావాలి

ఈ ఏడాదిలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి

వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి 

అధికారులకు సీఎం ఆదేశం

నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి 

జియో ట్యాగింగ్‌ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి


*వైయస్సార్‌ జగనన్న కాలనీలు*

వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని వివరించిన అధికారులు

ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలి 

ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, రోడ్లు ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి కావాలి

అధికారులకు సీఎం ఆదేశం


*పల్లెశుభ్రత–పెద్దపీట*

పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట

గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం అంగీకారం

అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాలు వ్యాప్తిని నిరోధించవచ్చన్న సీఎం

డోర్‌ టు డోర్‌ వ్యర్ధాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్‌ అంబాసిడర్స్, 4482 గ్రీన్‌ గార్డ్స్‌

కొత్తగా మరో 11,453 మంది గ్రీన్‌ అంబాసిడర్స్, 5551 మంది గ్రీన్‌ గార్డ్స్‌ ఏర్పాటుకు అమోదం

వ్యర్ధాల నిర్వహణకు భారీగా యంత్రాల వినియోగానికి నిర్ణయం

పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్ధాల  నిర్వహణకు  నిర్ణయం

9148 ఇన్సినిరేటర్స్, 3279 మిస్ట్‌ బ్లోయర్స్, 3197 బ్రష్‌ కట్టర్స్, 3130  హైప్రెషర్‌ టాయ్‌లెట్‌ క్లీనర్లు, 165 పోర్టబుల్‌ థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్లు, 157 షడ్డింగ్‌ మిషన్లు ఏర్పాటు

గ్రీన్‌ అంబాసిడర్, గ్రీన్‌ గార్డ్స్‌ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని వెల్లడించిన అధికారులు

వ్యర్ధాల సేకరణ వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి : సీఎం

పీపీఈ కిట్స్‌ డిస్పోజల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి


*క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)*

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగాలి

మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం ఉండాలి

అప్పుడే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుంది 

గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు తరలించే తరలించే ఏర్పాటు ఉండాలి

ఒక ప్రత్యేక నంబరును గ్రామాల్లో డిస్‌ప్లే చేయండి

కాల్‌ చేయగానే దాన్ని సంబంధిత వాహనం ద్వారా వ్యర్దాలను సేకరించి... ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలి

మురుగునీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాలి

డ్రెయిన్లను రెగ్యులర్‌గా క్లీనింగ్‌ చేయాలి

ఫోన్‌ చేయగానే వ్యర్ధాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై ఒక ప్రోటోకాల్‌ ఉండాలి

దీనికోసం పురపాలక, గ్రామీణాభివృద్ధిశాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్‌ ఉండాలి

బలమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌


*వైయస్సార్‌ చేయూత*

వైయస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్ధిర జీవనోపాధి కింద ఈ యేడాది 6 లక్షలమంది మహిళలకు లబ్ధి

మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్‌ సమస్య రాకుండా చేయాలి

టైఅప్‌ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు ఉన్నవి చూసుకోవాలి

మార్కెటింగ్‌ సామర్ద్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం


*వైయస్సార్‌ జలకళ*

వైయస్సార్‌ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైనది

లక్షలమంది రైతులకు ఉపయోగపడుతుంది, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

వైయస్సార్‌ జలకళ ప్రాజెక్టు సమర్ధవంతంగా ముందుకుసాగాలి

అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి


*నదుల మీదున్న బ్రిడ్జిలు వద్ద చెక్‌డ్యాం తరహా కట్టలు*

రాష్ట్రంలో చిన్న, చిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యాం తరహాలో నిర్మాణాలు చేపట్టాలి

కనీసం 3–4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలి

తద్వారా భూగర్భజలాలు బాగా పెరుగుతాయి

దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలి

అధికారులకు స్పష్టం చేసిన సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేపట్టాలి


*వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు*

వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్న సీఎం

దీనికోసం ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నిర్ణయం

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ 

సమగ్రసర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టనున్న కమిటీ


*ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో చేపడుతున్న వివిధ పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు*

జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంపై సీఎంకు వివరించిన అధికారులు

నాడు–నేడు లో భాగంగా చేపడుతున్న ఆస్పత్రులు,  స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యం


దీంతో పాటు వైయస్సార్‌ బీమా, జలజీవన్‌ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. 


ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ పి రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments