విజయవాడ (ప్రజా అమరావతి);
సామాజిక న్యాయమే ప్రభుత్వ ద్వేయం
సంక్షేమ పధకాల అమల్లో దేశానికి ఆదర్శం
రైతుల భాగస్వామ్యంతో పారదర్శకమైన సహకార వ్యవస్థ -మంత్రి కన్నబాబు
సామాజిక న్యాయం అమలు చేస్తూ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ జనరంజకంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార , మార్కెటింగ్, ఫుడ్ ప్రోస్సేసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. శుక్రవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలోకృష్ణా జిల్లా డిసిసిబి నూతన పాలక వర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో సామజిక న్యాయం అమలవుతోందనటానికి ఈ డిసిసిబి నూతన పాలకవర్గం ఎన్నిక నిదర్శనమన్నారు .
అన్ని సామాజిక వర్గాలకు సమకాలీన న్యాయం మన సీఎం జగన్ ద్యేయమని ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు .
అవినీతి రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు , నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు మంత్రి తెలిపారు .
ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రము దేశానికే ఆదర్శగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు . శాఖా పరంగా వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు
సహకార శాఖలో సంస్కరణలు చేపడుతూ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నామన్నారు.
రైతుల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకత కలిగిన వ్యవస్థను తయారు చేస్తున్నామన్నారు
నిధుల దుర్వినియోగాన్ని, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించమనని ఆయన స్పష్టం చేశారు . సహకార శాఖలో ఆడిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు .
ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటిల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేబడుతున్నామన్నారు .
అబ్కాబ్లో నూతన మానవ వనరుల పాలసీని అమలు చేస్తున్నామన్నారు .వాణిజ్య బ్యాంకులతో పోటీపడేలా మన సహకార బ్యాంకుల సేవలు విస్తృతం చేయాలనని ఆయన అభిలాషించారు .
నాబార్డు వారి నాబ్కాన్స్ సంస్థ ఆధ్వర్యంలో సహకార శాఖ బలోపేతానికి అమలు చేయాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు . అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు .
కృష్ణా జిల్లా డిసిసిబి సుమారు రూ .7200 కోట్ల టర్నోవర్ తో పురోగతి సాధిస్తోందన్నారు .
ఈ సహకార కేంద్ర బ్యాంకుకి మంచి చరిత్ర వుంది మరెంతో ఉన్నతమైన భవిష్యత్తు వుందన్నారు. ఈ కార్యక్రమంలో
ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు , కైలీ అనిల్ కుమార్, జోగి రమేష్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి , మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు , రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ,
కృష్ణ జిల్లా డిసిసిబి నూతన ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు , ఇతర సభ్యులు , వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment